Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై క్లారిటీ : మరో రెండేళ్లపాటు సేవలు

Webdunia
గురువారం, 8 జులై 2021 (17:06 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... ప్రస్తుతం జాతీయ క్రికెట్ జట్టు నుంచి తప్పుకున్నాడు. అదేసమయంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. 
 
అయితే, బుధవారమే తన 40వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ధోనీ... భారత జట్టుకు దూరమైనప్పటికీ ఐపీఎల్ ద్వారా ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ సందర్భంగా సీఎస్కే (చెన్నై సూపర్ కింగ్స్) సీఈఓ కాశీ విశ్వనాథ్ ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ధోనీ అభిమానులకు శుభవార్త చెప్పారు. అలాగే, ధోనీ క్రికెట్ కెరీప్‌పై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
సీఎస్‌కే ధోనీ మరో ఏడాది లేదా రెండేళ్లు ఆడతాడన్నారు. క్రికెట్‌కు ధోనీ దూరం కావాల్సిన ఏ ఒక్క కారణం కూడా తనకు కనిపించడం లేదని చెప్పారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నీ మధ్యలోనే ఆగిపోయింది. కరోనా కేసులు భారీగా పెరగడంతో టోర్నీని ఆపేశారు. టోర్నీలో మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించనున్నారు.ఐపీఎల్ తొలి అర్ధ భాగంలో ధోనీ ఆటతీరు సాధారణంగానే ఉన్నప్పటికీ... తన నాయకత్వ పటిమతో జట్టును రెండో స్థానంలో నిలిపాడు. రానున్న సీజన్లలో కూడా సీఎస్కేకు ధోనీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గబ్బర్ సింగ్ డైలాగ్‌లు కొట్టిన పవన్.. రబ్బరులా వణికిపోతున్నారు- ఆర్కే రోజా

సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

తర్వాతి కథనం
Show comments