Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్‌పై క్లారిటీ : మరో రెండేళ్లపాటు సేవలు

Webdunia
గురువారం, 8 జులై 2021 (17:06 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ... ప్రస్తుతం జాతీయ క్రికెట్ జట్టు నుంచి తప్పుకున్నాడు. అదేసమయంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. 
 
అయితే, బుధవారమే తన 40వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ధోనీ... భారత జట్టుకు దూరమైనప్పటికీ ఐపీఎల్ ద్వారా ఇప్పటికీ అభిమానులను అలరిస్తున్నాడు. ఈ సందర్భంగా సీఎస్కే (చెన్నై సూపర్ కింగ్స్) సీఈఓ కాశీ విశ్వనాథ్ ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ధోనీ అభిమానులకు శుభవార్త చెప్పారు. అలాగే, ధోనీ క్రికెట్ కెరీప్‌పై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
సీఎస్‌కే ధోనీ మరో ఏడాది లేదా రెండేళ్లు ఆడతాడన్నారు. క్రికెట్‌కు ధోనీ దూరం కావాల్సిన ఏ ఒక్క కారణం కూడా తనకు కనిపించడం లేదని చెప్పారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ టోర్నీ మధ్యలోనే ఆగిపోయింది. కరోనా కేసులు భారీగా పెరగడంతో టోర్నీని ఆపేశారు. టోర్నీలో మిగిలిన మ్యాచ్ లను యూఏఈలో నిర్వహించనున్నారు.ఐపీఎల్ తొలి అర్ధ భాగంలో ధోనీ ఆటతీరు సాధారణంగానే ఉన్నప్పటికీ... తన నాయకత్వ పటిమతో జట్టును రెండో స్థానంలో నిలిపాడు. రానున్న సీజన్లలో కూడా సీఎస్కేకు ధోనీ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్యార్థిని ప్రాణం తీసిన పెద్దనాన్న లైంగిక వేధింపులు

తెలంగాణకి రేవంత్ రెడ్డి ఇంకోసారి సీఎం కాలేడు: పగబట్టిన ప్రశాంత్ కిషోర్ (video)

Devaragattu: మల్లేశ్వర స్వామిలో కర్రలతో ఘర్షణ.. ఇద్దరు వ్యక్తులు మృతి

ఛత్తీస్‌గఢ్‌‌లో లొంగిపోయిన 103 మంది నక్సలైట్లు - 22 మంది మహిళలతో..?

Heavy Rains: ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు- రెడ్ అలర్ట్ జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంతార సినిమా 2016లో ఒక్క షో... 2025లో 5000 థియేటర్లు..

Karthik Raju: సరికొత్తగా విలయ తాండవం వుంటుందన్న కార్తీక్ రాజు

Nani 34: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ చిత్రం ప్రారంభం

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హీరోగా పురుష చిత్రీకరణ పూర్తి

NBK 111: నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం దసరా కు ముహూర్తం.. అక్టోబర్ 24న షూటింగ్

తర్వాతి కథనం
Show comments