Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి రోజు కానుక.. సాక్షికి వింటేజ్ కారును ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ

Advertiesment
పెళ్లి రోజు కానుక.. సాక్షికి వింటేజ్ కారును ఇచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ
, సోమవారం, 5 జులై 2021 (16:51 IST)
Vintage car
భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన భార్య సాక్షి సింగ్‌ల వివాహ వార్షికోత్సవం నేడు. 2010లో ప్రేమ పెళ్లి చేసుకుని ఒక్కటైన ఈ జంట దాంపత్యానికి 11 ఏళ్లు నిండాయి. వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి సాక్షి సింగ్‌కి ధోని ఓ మధురమైన బహుమతి ఇచ్చాడు. 
 
సాక్షి కోసం స్పెషల్ గా ఓ వింటేజ్ కారును కొనుగోలు చేశాడు మహీ. లేత నీలం, వైట్ కలర్ కాంబినేషన్‌లో ఉన్న కారును యానివర్సరీ కానుకగా ఇచ్చాడంటూ ఇన్‌స్టా స్టోరీలో సాక్షి సింగ్ పోస్టు చేసింది. ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ అతని ఫాలోయింగ్‌ మాత్రం తగ్గట్లేదు. ఇక, రిటైర్ దగ్గర నుంచి.. ఫామ్ హౌస్ లో భార్య సాక్షి, కూతురు జీవాలతో సరదాగా గడిపేస్తున్నాడు. 
 
ధోనీ.. సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండడు. దీంతో సాక్షినే.. ధోనీ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా ధోని ఫ్యాన్స్‌కు షేర్ చేస్తుంటోంది. వీరిద్దరికీ జీవా ధోనీ అనే కూతురు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఐదేళ్ల జీవాకి ఇన్‌స్టాలో సెపరేట్ అకౌంట్ ఉండడమే కాదు, దాదాపు 2 మిలియన్ల ఫాలోవర్లు కూడా ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ సీఎం జగన్‌తో అనిల్ కుంబ్లే భేటీ!