Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో ధోనీ... ఫిబ్రవరి 12 నుంచి ఐపీఎల్ మెగా వేలం పాట

Webdunia
శుక్రవారం, 28 జనవరి 2022 (09:16 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైకు చేరుకున్నారు. వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ కోసం ఆటగాళ్ళ వేలం పాటలు జరుగనున్నాయి. ఈ పాటల్లో పాల్గొనేందుకు ఆయన చెన్నైకు వచ్చారు. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో ఐపీఎల్ వేలం పాటలు జరుగనున్నాయి. అప్పటివరకు ఆయన చెన్నైలో ఉండి ఆటగాళ్ల ఎంపిక తదితర అంశాలపై చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ నిర్వాహకులతో సమాలోచనలు జరుపనున్నారు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ ట్విట్టర్‌లో ధోని ఫోటోను షేర్ చేసి తెలిపింది. 
 
"అవును, అతను ఈ రోజు చెన్నైకి వచ్చాడు. వేలం పాట చర్చల కోసం అతను ఇక్కడే ఉంటాడు. అతను వేలానికి హాజరయ్యే అవకాశం ఉంది" అంటూ ట్వీట్ చేసింది. కాగా, ధోనీని ఈ యేడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ 12 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. 
 
అలాగే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనుగోలు (రీటైన్) చేసిన ఆటగాళ్ళలో రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీతో సహా నలుగురు ఆటగాళ్లను రిటైన్ ఉన్నారు. 
 
ఇందులో జడేజాను రూ.16 కోట్లకు అట్టిపెట్టుకోగా, ధోనీ రూ.12 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే, అలీని రూ.8 కోట్లకు రిటైన్ చేయగా, గైక్వాడ్ రూ.6 కోట్లకు దక్కించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid Alert: కేరళలో JN.1 వేరియంట్ ప్రభావం.. ఆరువేలకు పెరిగిన కేసులు

ప్రియుడు కావాలంటే అతడినే పెళ్లాడాలి, కానీ ఇలా భర్తను చంపేయడమేంటి? (video)

Jagan : కొమ్మినేని అరెస్ట్‌ను ఖండించిన జగన్.. యాంకర్‌ను శిక్షించడం అన్యాయం

RPF: కానిస్టేబుల్ దంపతులపై దుండగుల దాడి.. గర్భంతో వున్నానని చెప్పినా వదల్లేదు

లివింగ్ పార్టనర్ ఇంట్లో ఉరేసుకున్న మహిళ.. ఏం జరిగింది? హత్యా లేకుంటే..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments