Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్వేషం కలిగేలా ట్రోల్స్ చేస్తున్నారు ... మౌనం అర్థాంగికారం కాదు : చాహల్ సతీమణి ధర్మశ్రీ

ఠాగూర్
గురువారం, 9 జనవరి 2025 (15:04 IST)
భారత క్రికెటర్ యజువేంద్ర చాహల్ - ధనశ్రీ వర్మ దంపతులు విడిపోబోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. దీనిపై ధనశ్రీ వర్మ తాజాగా ఓ ట్వీట్ చేయగా, అది వైరల్‌గా మారింది. కొన్ని రోజులుగా మీడియాలో వస్తోన్న వార్తల వల్ల తాను మానసిక వేదనకు గురవుతున్నట్లు ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.
 
'కొన్ని రోజులుగా నేను, నా కుటుంబం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. నిజానిజాలు తెలుసుకోకుండా అవాస్తవాలు రాస్తున్నారు. నాపై ద్వేషం కలిగేలా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ విషయం నన్ను నిజంగా బాధిస్తోంది. నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాను. నేను మౌనంగా ఉంటున్నానంటే దాని అర్ధం బలహీనంగా ఉన్నట్లు కాదు.
 
సోషల్ మీడియాలో ప్రతికూలత ఉన్నప్పటికీ ఇతరులపై కరుణ చూపాలంటే ధైర్యం అవసరం. నేను వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని విలువలతో ముందుకుసాగాలనుకుంటున్నా. నిజం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది. దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం లేదు' అని ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ధనశ్రీ పోస్ట్ వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

1450 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు.. రూ.1052 కోట్ల టెండర్లు పిలవాలి- చంద్రబాబు

KTR: కేటీఆర్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు.. ఇచ్చిందెవరు?

ఎయిర్ ఇండియా విమానం తోకలో బైటపడిన ఎయిర్ హోస్టెస్ మృతదేహం

Heavy rain alert: రాబోయే మూడు రోజులు ఏపీలో భారీ వర్షాలు

బీజేపీ నేత మాధవి లత ఎలైట్ హిల్స్ అపార్ట్‌మెంట్ వివాదం.. ఏం జరిగింది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

తర్వాతి కథనం
Show comments