Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేధించడమే కాదు నా దేశభక్తిని శంకించారు : మిథాలీ రాజ్

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (15:11 IST)
తనను మానసికంగా వేధించడమేకాదు తన దేశభక్తిని కూడా శంకించారని భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ అభిప్రాయపడ్డారు. అందుకే ఈ రోజు తన జీవితంలో చీకటి రోజని వ్యాఖ్యానించారు. జట్టు కోచ్‌ రమేష్ పొవార్‌పై తీవ్ర అసంతృప్తిని ఆమె వ్యక్తం చేశారు. 
 
తాను స్వార్థపరురాలినని, టీమ్‌లో గందరగోళం సృష్టిస్తానని, తిడతానని, తనను ఓపెనర్‌గా దింపకపోతే రిటైరవుతానని మిథాలీ బెదిరించినట్లు పొవార్ తన నివేదికలో వెల్లడించాడు. అంతేకాదు మిథాలీ తనకు తాను టీమ్, దేశం కంటే గొప్పదానిగా భావిస్తుందని ఆరోపించాడు. 
 
ఈ ఆరోపణలపై ట్విట్టర్ వేదికగా మిథాలీ రాజ్ స్పందించారు. పొవార్ ఆరోపణలను తనను ఎంతగానో బాధించాయని పేర్కొంది. 20 ఏళ్లుగా దేశం కోసం నేను చిందించిన చెమట, హార్డ్‌వర్క్ వృథా అయ్యాయి. ఆటకి, దేశానికి ఎంతో నిబద్ధతతో సేవలందించాను. నా దేశభక్తిని శంకించారు. నా నైపుణ్యాన్ని ప్రశ్నించారు. ఇది నా జీవితంలో చీకటి రోజు అని మిథాలీ ట్వీట్ చేసింది. కోచ్ రమేష్ పొవార్ తనను ఎంతో అవమానించాడని, టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా అమానుషంగా వ్యవహరించాడని మిథాలీ ఆరోపించింది. ఆ మరుసటి రోజే అతను బోర్డుకు నివేదిక అందించాడు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments