Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా క్రైసిస్ : ఆ నాలుగు సంస్థలకు రోహిత్ విరాళాలు

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (13:37 IST)
దేశం కరోనా కోరల్లో చిక్కుకుంది. దీని నుంచి బయటపడేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ కష్ట సమయంలో పేదలను, కరోనా బాధితులను ఆదుకునేందుకు వీలుగా అనేక మంది దాతలు తమకు తోచినంత ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇందులో భారత క్రికెటర్ రోహిత్ శర్మ కూడా చేఱారు. ఈయన మొత్తం రూ.80 లక్షలను విరాళంగా ప్రకటించాడు. 
 
ఈ మొత్తంలో పీఎం కేర్స్ నిధికి రూ.45 లక్షలు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు, ఫీడింగ్ ఇండియాకు రూ.5 లక్షలు, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థకు రూ.5 లక్షల చొప్పున అందించినట్టు మంగళవారం రోహిత్ శర్మ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 
 
దేశం మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవాలని, ఇందుకోసం కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రోహిత్ గుర్తు చేశాడు. కరోనాపై యుద్ధంలో ప్రధాని మోడీతో పాటు నాయకులకు మద్దతుగా నిలుద్దామని పిలుపునిచ్చాడు. 
 
వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థకు విరాళమిచ్చి.. వీధి శునకాల సంక్షేమానికి హిట్​మ్యాన్ తోడ్పాటునందించాడు. జంతు ప్రేమికుడిగా మరోసారి నిరూపించుకున్నాడు.
 
కాగా, ఇప్పటికే కెప్టెన్ కోహ్లీ దంపతులు, ఓపెనర్​ ధవన్​, రహానే, రైనాతో పాటు మరికొందరు క్రికెటర్లు విరాళాలు ఇచ్చారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ.50 లక్షల విలువైన బియ్యాన్ని అవసరార్థులకు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన జగన్.. రైతులు క్యూల్లో నిలబడాల్సి వుంది

ప్రియుడిచ్చే పడక సుఖం కోసం భర్తను కుమార్తెను చంపేసిన మహిళ

Teaching Jobs: 152 మంది మైనారిటీ అభ్యర్థులకు ఉద్యోగాలు

కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం వస్తుందనీ కన్నతండ్రిని చంపేశాడు...

చైన్ స్నాచింగ్ అలా నేర్చుకున్న వ్యక్తి అరెస్ట్- రూ.20లక్షల విలువైన బంగారం స్వాధీనం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika : విజయ్ దేవరకండ, రష్మిక పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

Nag Ashwin: కళ్యాణి ప్రియదర్శన్ నేనూ ఒకేలా వుంటాం, ఆలోచిస్తాము :దుల్కర్ సల్మాన్

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

Sri Vishnu: గతంలో రిలీజ్ కు సురేష్ బాబు, దిల్ రాజు, ఇప్పుడు బన్నీ వాస్ వున్నారు : శ్రీ విష్ణు

Anushka : అందుకే సినిమాలు తగ్గించా.. ప్రస్తుతం మహాభారతం చదువుతున్నా : అనుష్క శెట్టి

తర్వాతి కథనం
Show comments