Webdunia - Bharat's app for daily news and videos

Install App

చాంపియన్స్ ట్రోఫీ - భారత్ ఆడే మ్యాచ్‌లపై కీలక నిర్ణయం!!

ఠాగూర్
ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (16:41 IST)
ఈ నెల 19వ తేదీ నుంచి పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో భారత్ పాల్గొంటుంది. కానీ, భారత్ అన్ని మ్యాలను దుబాయ్‌లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో భారత్ మ్యాచ్‌లపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు ఈ టోర్నీలో ఆడే మ్యాచ్‍లకు అదనపు టిక్కెట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. 
 
హైబ్రిడ్ మోడల్‌లో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు గ్రూపు-ఏలో ఉంది. భారత్ తన తొలి మ్యాచ్‌ను ఈ నెల 20వ తేదీన బంగ్లాదేశ్‌తో, 23వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో, మార్చి 2వ తేదీన న్యూజిలాండ్ జట్టుతో లీగ్ మ్యాచ్‌లను ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు ఇప్పటికే టిక్కెట్లను విడుదల చేసిన ఐసీసీ... తాజాగా అదనపు టిక్కెట్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. టీమిండియా ఫ్యాన్స్‌కు ఇది నిజంగానే శుభవార్తే. 
 
కాగా, చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్ అన్ని మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరుగనుంది. ఒక వేళ భారత్ ఫైనల్ చేరితో ఫైనల్‌ మ్యాచ్ పాకిస్థాన్‌లో కాకుండా దుబాయ్‌లో జరుగనుంది. ఈ టైటిల్ మ్యాచ్ టిక్కెట్లపైనా ఐసీసీ స్పందించింది సెమీ ఫైనల్ మ్యాచ్‍‌లకు పరమితంగానే టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఫైనల్ మ్యాచ్‌కు ఇంకా టిక్కెట్లు విడుదల చేయలేదని పేర్కొంది. 
 
అలాగే, ఫైనల్ మ్యాచ్‌ జరిగేది దుబాయ్ లేదా లాహోర్ అని భారత్ గెలుపోటములపై ఆధారపడివుంటుంది. సెమీస్‌‍లో ఇండియా ఓడిపోతే ఫైనల్ మ్యాచ్ లాహోర్‌లో జరుగుతుంది. ఒకవేళ గెలిస్తే మాత్రం ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతుంది. ఆ తర్వాతే ఈ టిక్కెట్లపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోడీ సర్కారు కుట్ర : మల్లికార్జున ఖర్గే

దోషి అని తేలితే ఉరి తీయండి.. సోనమ్ సోదరుడు

మహిళలు గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక : ఉపాస‌న కామినేని కొణిదెల

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments