Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ : విజేతకు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

ఠాగూర్
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2025 (16:25 IST)
ఈ నెల 19వ తేదీ నుంచి పాకిస్థాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీలో విజేతకు భారీ మొత్తంలో నగదు బహుమతి అందజేయనున్నారు. ఈ ప్రైజ్ మనీపై ఐసీసీ శుక్రవారం అధికారిక ప్రకటన వెలువరించింది. టోర్నీ ఫైనల్ విజేతగా నిలిచే జట్టుకు ఏకంగా రూ.20.80 కోట్ల మేరకు నగదు బహుమతిని అందజేయనున్నారు. అలాగే, రన్నరప్ జట్టుకు రూ.10.40 కోట్లు, సెమీస్ చేరిన జట్లకు రూ.5.20 కోట్లు ఇవ్వనున్నారు. 
 
ఇక నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచిన జట్టుకు తలా రూ.3 కోట్లు, ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో రూ.1.20 కోట్లు అందుకోనున్నాయి. ఇక చాంపియన్స్ ట్రోఫీలో ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ.29 లక్షల అదనంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అయితే, 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో విజేత జట్టుకు రూ.14.18 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ.7 కోట్లు చొప్పున ప్రైజ్ మనీ ఇచ్చారు. 
 
కాగా, ఈ దఫా జరిగే టోర్నీలో భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్ వేదికగా ఆడనున్న విషయం తెల్సిందే. ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత 23వ తేదీన దాయాది దేశం, చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య జట్టు పాకిస్థాన్‌తో తలపడుతుంది. మార్చి ఒకటో తేదీన న్యూజిలాండ్ జట్టుతో రోహిత్ సేన ఆడుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

తర్వాతి కథనం
Show comments