Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం.. టీ20 ప్రపంచ కప్ తర్వాత కెప్టెన్సీ?

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (12:03 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఆంగ్ల మీడియా కోడైకూస్తోంది. టీ20 ప్రపంచ కప్ అనంతరం అతను వన్డే, టీ20లలో కెప్టెన్సీ వీడనున్నట్టు సమాచారం.

టీ20 ప్రపంచ కప్ తర్వాత తనంతట తాను టీ20, వన్డేలలో కెప్టెన్సీ నుంచి తప్పుకుని హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పే యోచనలో కోహ్లి ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాలని కోహ్లి యోచిస్తున్నాడట. దీనిపై బీసీసీఐతో కూడా సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
 
ఇప్పటివరకు కోహ్లి 95 వన్డే మ్యాచ్‌లకు సారథ్యం వహించగా 65 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. అలాగే 45 టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించగా 29 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది. అంటే విజయవంతమైన కెప్టెన్ గా నిరూపించుకున్నట్టే. అయితే సారథ్య బాధ్యతలతో అతను బ్యాటింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టట్లేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం.
 
మరో వైపు రోహిత్ కూడా అవసరమైనప్పుడు తన నాయకత్వాన్ని ప్రదర్శించి సత్తా చాటుకున్నాడు. అలాగే ఐపీఎల్ లో ముంబైకు 5 ట్రోఫీలు అందించి తనేంటో నిరూపించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఈ కెప్టెన్సీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నారా లోకేష్.. ఎందుకంటే?

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలు

చిత్తూరులో భారీ వర్షాలు-టమోటా రైతుల కష్టాలు.. వందలాది ఎకరాల పంట నీట మునక

బెంగళూరులోని ఓ పాపులర్ కేఫ్‌‌.. పొంగలిలో పురుగు.. అదంతా సోషల్ మీడియా స్టంటా?

విమానం గగనతలంలో ఉండగా ప్రయాణికుడు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

తర్వాతి కథనం
Show comments