భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ప్రతి సంవత్సరం క్రికెటర్లకు వారి సామర్థ్యం ఆధారంగా గ్రేడ్ వారీగా వేతనాన్ని అందజేస్తోంది. తాజాగా 2022-23 సంవత్సరానికి సంబంధించిన గ్రేడ్లను బీసీసీఐ ప్రకటించింది.
బీసీసీఐ భారత క్రికెటర్లకు గ్రేడ్ ఆధారంగా జీతాలు ఇస్తోంది. దీని ప్రకారం ఏ ప్లస్ గ్రేడ్లో ఉన్న స్టార్ ప్లేయర్లకు రూ.7 కోట్లు, ఏ కేటగిరీ ఆటగాళ్లకు రూ.5 కోట్లు, బీ కేటగిరీ ఆటగాళ్లకు రూ.3 కోట్లు, సీ కేటగిరీ ఆటగాళ్లకు కోటి రూపాయలను అందజేస్తారు.
ఈ సిరీస్లో ఇప్పటివరకు ఏ గ్రేడ్లో కొనసాగుతున్న కేఎల్ రాహుల్.. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తుండటంతో గ్రేడ్బీకి దిగజారాడు. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ల్లో మంచి ప్రదర్శన కనబరిచిన జడేజాను ఏ కేటగిరీ నుంచి ఏ ప్లస్ కేటగిరీకి మార్చారు.