Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్ల్యూపీఎల్‌: విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (08:50 IST)
Mumbai Indians
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. భారత్‌లో తొలిసారిగా నిర్వహించిన ఈ పోటీల్లో ముంబై ఇండియన్స్ గెలుపును నమోదు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఫైనల్‌లో తలపడిన ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 
 
132 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నాట్ షివర్ 60 పరుగులతో అదరగొట్టింది. 55 బంతులు ఎదుర్కొన్న షివర్ 7 బౌండరీలు బాదింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌తో గెలుపును నమోదు చేసుకుంది. 
 
లక్ష్య చేధనలో 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్‌ను నాట్ షివర్, హర్మన్ ప్రీత్ జోడీ ఆదుకుంది. హర్మన్ ప్రీత్ అవుటైనా, మీలీ కెర్ (14 నాటౌట్) సహకారంతో నాట్ షివర్ మిగతా పని పూర్తి చేసింది. 
 
అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కత్తితో పొడవాలన్నదే ప్లాన్ : ప్రధాన నిందితుడు వాంగ్మూలం

నాగర్ కర్నూల్‌లో భర్త దారుణం- భార్యను అడవిలో చంపి నిప్పంటించాడు

అవినీతికి పాల్పడితే ప్రధాని అయినా జైలుకు వెళ్లాల్సిందే : అమిత్ షా

పాకిస్తాన్ వరదలు- 788 మంది మృతి, వెయ్యి మందికి పైగా గాయాలు (video)

తెలంగాణాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

తర్వాతి కథనం
Show comments