Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్ల్యూపీఎల్‌: విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు

Webdunia
సోమవారం, 27 మార్చి 2023 (08:50 IST)
Mumbai Indians
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. భారత్‌లో తొలిసారిగా నిర్వహించిన ఈ పోటీల్లో ముంబై ఇండియన్స్ గెలుపును నమోదు చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఫైనల్‌లో తలపడిన ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 
 
132 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 19.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నాట్ షివర్ 60 పరుగులతో అదరగొట్టింది. 55 బంతులు ఎదుర్కొన్న షివర్ 7 బౌండరీలు బాదింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌తో గెలుపును నమోదు చేసుకుంది. 
 
లక్ష్య చేధనలో 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్‌ను నాట్ షివర్, హర్మన్ ప్రీత్ జోడీ ఆదుకుంది. హర్మన్ ప్రీత్ అవుటైనా, మీలీ కెర్ (14 నాటౌట్) సహకారంతో నాట్ షివర్ మిగతా పని పూర్తి చేసింది. 
 
అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 131 పరుగులు చేసింది.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments