Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : శివాలెత్తిన పాకిస్థాన్.. నేపాల్‌పై 238 రన్స్ తేడాతో గెలుపు

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (10:45 IST)
ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా పాకిస్థాన్ నేపాల్ జట్ల మధ్య బుధవారం తొలి మ్యాచ్ జరిగింది. ఇందులో పాక్ కుర్రోళ్లు శివాలెత్తిపోయారు. ఫలితంగా క్రికెట్ పసికూన నేపాల్ జట్టుపై 238 పరుగుల తేడాతో విజయభేరీ మోగించారు. ఇది పాకిస్థాన్ జట్టు చరిత్రలో మూడో అతిపెద్ద విజయం. 
 
ఈ మ్యాచ్ తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం (151), ఇప్తికార్ అహ్మద్ (109) సెంచరీలతో విధ్వంసం సృష్టించడంతో తొలిసారి ఆసియాకప్ ఆడుతున్న పసికూన నేపాల్ విలవిల్లాడిపోయింది. పాక్ బ్యాటర్లపై నేపాల్ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
 
అనంతరం 343 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నేపాల్ 23.4 ఓవర్లలో 104 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. జట్టులో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్ కాగా, ఐదుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. 
 
ఆరిఫ్ షేక్ 26, సోంపాల్ కామి 28, గుల్సన్ ఝా 13 పరుగులు చేశారు. వీరిద్దరు మాత్రమే చెప్పుకోదగిన విధంగా రెండంకెల స్కోరు చేశారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4, షహీన్ అఫ్రిది, హరీశ్ రవూఫ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కెప్టెన్ బాబర్ ఆజంకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం గంగా నదిలో దిగింది, చూస్తుండగానే కొట్టుకుపోయింది (video)

దేశంలోనే తొలిసారి.. క్యాష్ ఆన్ వీల్ - రైలులో ఏటీఎం (Video)

నాకు తియ్యని పుచ్చకాయ కావాలి, చెప్పవే చాట్‌జీపీటీ (Video)

మంత్రివర్గం కీలకమైన సమావేశం- పవన్ కల్యాణ్ చేతికి సెలైన్ డ్రిప్

ఆ పని చేస్తే సీఎస్‌తో అధికారులందరినీ జైలుకు పంపిస్తాం : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తన ముందే బట్టలు మార్చుకోవాలని ఆ హీరో ఇబ్బందిపెట్టేవాడు : విన్సీ అలోషియస్

Shivaraj Kumar: కేన్సర్ వచ్చినా షూటింగ్ చేసిన శివరాజ్ కుమార్

తమన్నా ఐటమ్ సాంగ్ కంటే నాదే బెటర్.. ఊర్వశీ రౌతులా.. ఆపై పోస్ట్ తొలగింపు

దిల్ రాజు కీలక నిర్ణయం.. బిగ్ అనౌన్స్‌మెంట్ చేసిన నిర్మాత!! (Video)

Pooja Hegde: సరైన స్క్రిప్ట్ దొరక్క తెలుగు సినిమాలు చేయడంలేదు : పూజా హెగ్డే

తర్వాతి కథనం
Show comments