Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత క్రికెట్ జట్టులో కరోనా కలకలం : ఒకరికి పాజిటివ్

Webdunia
గురువారం, 15 జులై 2021 (08:57 IST)
భారత క్రికెట్ జట్టులో కలకలం చెలరేగింది. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇండియ‌న్ టీమ్‌ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. మొత్తం 23 మంది క్రికెట‌ర్ల బృందంలో ఒక‌రికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. 
 
డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ త‌ర్వాత 20 రోజుల బ్రేక్ దొర‌క‌డంతో ఈ గ్యాప్‌లో ప్లేయ‌ర్స్ యూకేలో సైట్ సీయింగ్‌కు వెళ్లారు. ఆటగాళ్లు యూకేలో త‌లో దిక్కుకు వెళ్లారు. కొంద‌రు వివిధ ప్ర‌దేశాల‌ను చూడ‌టానికి వెళ్ల‌గా.. మ‌రికొంద‌రు యూరో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు కూడా చూశారు. 
 
నిజానికి ప్లేయ‌ర్స్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా.. దాని నుంచి పూర్తి ర‌క్ష‌ణ ఉండ‌ద‌ని, యూరో, వింబుల్డ‌న్‌లాంటి టోర్నీల‌కు వెళ్లొద్ద‌ని బీసీసీఐ చెప్పినా కొంద‌రు విన‌లేదు. అప్పుడే స‌ద‌రు ప్లేయ‌ర్ కొవిడ్ బారిన ప‌డ్డాడు. గురువారం టీమంతా డ‌ర్హ‌మ్ వెళ్ల‌నుండ‌గా.. ఆ ప్లేయ‌ర్ మాత్రం టీమ్‌తో పాటు వెళ్ల‌డం లేదు. 
 
డ‌ర్హ‌మ్‌లో టీమిండియా మ‌రోసారి బ‌యోబబుల్‌లోకి వెళ్ల‌నుంది. ఇంగ్లండ్‌తో సిరీస్ ఆగ‌స్ట్ 4న ప్రారంభ‌మ‌వుతుంది. ఒక ప్లేయ‌ర్ క‌రోనా బారిన ప‌డిన మాట నిజ‌మే. అయితే అత‌నికి పెద్ద‌గా ల‌క్ష‌ణాలేమీ లేవు. ప్ర‌స్తుతం అత‌డు క్వారంటైన్‌లో ఉన్నాడు. టీమ్‌తో కలిసి డ‌ర్హ‌మ్ వెళ్ల‌డం లేదు అని బీసీసీఐ అధికారి ఒక‌రు పీటీఐకి వెల్ల‌డించారు. అయితే, కరోనా వైరస్ సోకిన క్రికెట్ ఆటగాడి పేరు మాత్రం ఎవ‌రూ బ‌య‌ట‌పెట్ట‌లేదు. 

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments