Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా కప్ : భారత్ ఆశలు గల్లంతు.. ఫైనల్లో పాకిస్థాన్

Webdunia
గురువారం, 8 సెప్టెంబరు 2022 (09:16 IST)
ఆసియా కప్ టోర్నీలోభాగంగా, బుధవారం రాత్రి ఆప్ఘనిస్థాన్, పాకిస్థాన్ జట్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు చచ్చీచెడి గెలిచింది. చివరి బంతి వరకు అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఆప్ఘనిస్థాన్ జట్టు ఓడినంత పనిచేసింది. అయితే, పాకిస్థాన్ ఆటగాడు నసీమ్ షా వరుస బంతుల్లో రెండు సిక్స్‌లు కొట్టడంతో పాకిస్థాన్ చట్టు మరో నాలుగు బంతులు మిగివుంగానే గెలుపును సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో భారత్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. అదేసమయంలో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకతో పాకిస్థాన్ జట్టు తలపడనుంది.
 
తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘన్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగుల స్వల్ప స్కోరు చేసింది. ఆప్ఘన్ ఆటగాళ్ళను పాక్ బౌలర్లు కట్టడి చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు ఈ స్కోరును ఛేదించేందుకు ఆపసోపాలు పడింది. లక్ష్యఛేదనలో 45 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయిన పాక్ జట్టును ఇఫ్తికార్ అహ్మద్ (30), షాహద్ కాన్ (36)లు ఆదుకున్నారు. 
 
ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో పాక్ గెలిచితీరాంటే ఆరు బంతుల్లో 11 పరుగులు కావాల్సిన తరుణంలో చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉంది. అయితే, ఫరూకీ వేసిన ఆ ఓవర్‌లో నసీమ్ షా తొలి రెండు బంతులను సిక్సర్లుగా మిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments