Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడిన రిషభ్ పంత్ : ఎమోషనల్ పోస్ట్

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (13:13 IST)
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును రిషభ్ పంత్ వీడాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం పాటల్లో పంత్‌ ప్రతి ఒక్కరినీ ఆకర్షించిన విషయం తెల్సిందే. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో గత తొమ్మిదేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో కొనసాగుతూ వచ్చిన రిషభ్ పంత్... వచ్చే ఐపీఎల్ సీజన్‌లో లక్నో జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ జట్టును వీడుతూ ఒక భావోద్వేగ పోస్టును చేశాడు. 
 
'యుక్త వయసులో నేను ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాను. మైదానంలో ఎన్నో ఉత్కంఠభరితమైన క్షణాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతో నేర్చుకున్నాను. అది నా అభివృద్ధికి సహాయపడింది. ఢిల్లీ జట్టుతో తొమ్మిదేళ్ల నా ప్రయాణం ఎంతో అద్భుతం. ఈ జర్నీ నాకెంతో విలువైంది. జీవితంలో క్లిష్ట సమయాల్లో అభిమానులు ఎంతో అండగా ఉన్నారు. నేను ముందుకుసాగుతున్నప్పటికీ.. మీ ప్రేమాభిమానాలు నా హృదయంలో ఎప్పటికీ ఉంటాయి. మైదానంలో మిమ్మల్ని ఉత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. నా ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్‌ పోస్టు పెట్టాడు. పంత్ పోస్ట్ ఇపుడు వైరల్‌గా మారింది. 
 
కాగా.. ఐపీఎల్‌ వేలంలో రిషభ్‌ పంత్‌పై లక్నో కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అతడి కోసం లక్నో, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లక్నో రూ.27 కోట్ల రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది. దీంతో లక్నో జట్టులో చేరిన పంత్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పంత్‌ పెట్టిన పోస్టు అభిమానుల మనసును హత్తుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమ్మ కుటుంబానికి అవమానం తెచ్చింది.. చంపేద్దాం.. తండ్రీ కూతుళ్ల దారుణం

ఏపీ ప్రజలకు వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలిపిన ఆ ముగ్గురు..?

Khairatabad: ఖైరతాబాద్ వినాయకుడి సన్నిధిలోనే ప్రసవించిన మహిళ

వినాయక చవితి ఉత్సవాలకు అంతరాయం కలిగిస్తున్న వరుణుడు

Ganesha Festival: చామంతి పువ్వులకు భారీ డిమాండ్.. కిలో రూ.500

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suvvi Suvvi: ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ఓజీ రొమాంటిక్ సాంగ్ సువ్వి సువ్వి (video)

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

తర్వాతి కథనం
Show comments