Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడిన రిషభ్ పంత్ : ఎమోషనల్ పోస్ట్

ఠాగూర్
మంగళవారం, 26 నవంబరు 2024 (13:13 IST)
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును రిషభ్ పంత్ వీడాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ మెగా వేలం పాటల్లో పంత్‌ ప్రతి ఒక్కరినీ ఆకర్షించిన విషయం తెల్సిందే. ఫలితంగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో గత తొమ్మిదేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో కొనసాగుతూ వచ్చిన రిషభ్ పంత్... వచ్చే ఐపీఎల్ సీజన్‌లో లక్నో జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ జట్టును వీడుతూ ఒక భావోద్వేగ పోస్టును చేశాడు. 
 
'యుక్త వయసులో నేను ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాను. మైదానంలో ఎన్నో ఉత్కంఠభరితమైన క్షణాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతో నేర్చుకున్నాను. అది నా అభివృద్ధికి సహాయపడింది. ఢిల్లీ జట్టుతో తొమ్మిదేళ్ల నా ప్రయాణం ఎంతో అద్భుతం. ఈ జర్నీ నాకెంతో విలువైంది. జీవితంలో క్లిష్ట సమయాల్లో అభిమానులు ఎంతో అండగా ఉన్నారు. నేను ముందుకుసాగుతున్నప్పటికీ.. మీ ప్రేమాభిమానాలు నా హృదయంలో ఎప్పటికీ ఉంటాయి. మైదానంలో మిమ్మల్ని ఉత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా. నా ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్‌ పోస్టు పెట్టాడు. పంత్ పోస్ట్ ఇపుడు వైరల్‌గా మారింది. 
 
కాగా.. ఐపీఎల్‌ వేలంలో రిషభ్‌ పంత్‌పై లక్నో కాసుల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. అతడి కోసం లక్నో, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లక్నో రూ.27 కోట్ల రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది. దీంతో లక్నో జట్టులో చేరిన పంత్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పంత్‌ పెట్టిన పోస్టు అభిమానుల మనసును హత్తుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వామ్మో... జాన్వీ కపూర్‌కు అంత కాస్ట్లీ గిఫ్టా?

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

తర్వాతి కథనం
Show comments