భారత్తో టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు గురువారం జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభం కానున్న 4 మ్యాచ్ల సిరీస్లో తొలి రెండు టెస్టుల కోసం జట్టును ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టుతో పాటు ఆరుగురిని రిజర్వ్ ఆటగాళ్లుగా ఎంపిక చేసింది. శ్రీలంక పర్యటనకు విశ్రాంతి ఇచ్చిన ఆల్రౌండర్ బెన్ స్టోక్స్, స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి వచ్చారు.
పెటర్నిటీ లీవ్ మీద శ్రీలంక పర్యటనకు దూరమైన రోరీ బర్న్స్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. జానీ బెయిర్ స్టో, సామ్ కర్రన్, మార్క్వుడ్లకు జట్టులో చోటు దక్కలేదు. ఒల్లీ పోప్ ఫిట్నెస్ సాధించిన అనంతరం జట్టుతో చేరుతాడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. కరోనా బారిన పడి కోలుకున్న మొయిన్ అలీకి కూడా అవకాశం దక్కింది.