Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్ డైనమెట్ రికార్డును బద్ధలుకొట్టిన విరాట్ కోహ్లీ

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (10:26 IST)
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో కోహ్లీ వ్యక్తిగతంగా 25 పరుగులు చేయ‌డం ద్వారా భారత మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు.
 
కాగా, హామిల్ట‌న్‌ టీ20లో కోహ్లీ 38 ప‌రుగులు చేసిన విష‌యం తెలిసిందే. భారత్‌ తరపున కెప్టెన్‌గా అత్యధిక టీ20 పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకూ ధోనీ (1112 ) పేరిట ఉంది. తాజాగా ఆ రికార్డును  కోహ్లీ(1126) త‌న పేరిట లిఖించుకున్నాడు.
 
ఓవరాల్‌గా టీ20ల్లో కెప్టెన్‌గా అత్యధిక రన్స్‌ చేసిన జాబితాలో సౌతాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌(1,273), న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలయమ్సన్‌(1148,  భార‌త్‌తో మూడో టీ20 ముందు వ‌ర‌కు) ఉన్నారు. దీంతో ఓవ‌రాల్ జాబితాలో కింగ్ కోహ్లీ మూడో స్థానాన్ని ద‌క్కించుకున్నాడు. 
 
మరోవైపు, ఈ ట్వంటీ20 సిరీస్‌ను భారత్ కైవసం చేసుకున్న విషయం తెల్సిందే. సూపర్ ఓవర్‌లో నరాలు తెగే ఉత్కంఠ మధ్య భారత్ సిరీస్‌ను తన వశం చేసుకుంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలులో దారుణం.. కాలు నరికి అందరికీ చూపించాడు...

15 రోజుల పసికందును లోకల్ రైలులో వదిలి పారిపోయిన మహిళ.. తర్వాత ఏం జరిగింది?

మంగళగిరి ఎయిమ్స్‌లో ర్యాగింగ్.. నిందితుల్లో డీన్స్ కుమారుడు? 25 మందిపై సస్పెన్షన్!!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉగ్రవాదులా? ఇద్దరి అరెస్టు కూడా...

పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. అంత నేరం ఏం చేశారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments