ఐపీఎల్ జరుగుతుంది.. కానీ స్టేడియాల్లో ప్రేక్షకులు ఉండరు : కుంబ్లే

Webdunia
గురువారం, 28 మే 2020 (14:38 IST)
భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైనా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశారు. స్వదేశంలో జరగాల్సిన ఇడియన్ ప్రీమియర్ లీగ్ 11వ అంచె పోటీలు కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదాపడిన విషయం తెల్సిందే. అయితే, ఈ టోర్నీ ఈ యేడాది జరుగుతుందా లేదా అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది.
 
ఎందుకంటే.. కరోనా వైరస్ కారణంగా అనేక అంతర్జాతీయ క్రీడా పోటీలు వాయిదాపడ్డాయి. అలాంటివాటిలో ఒకటి జపాన్ టోక్యో రాజధానిలో జరగాల్సిన ఒలింపిక్స్ పోటీలు కూడా ఉన్నాయి. దీంతో ఐపీఎల్‌పై కూడా నీలి మేఘాలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ వాయిదా పడింది. 
 
ఈ ఏడాది జరుగుతుందా? లేదా? అనే అయోమయం సర్వత్ర నెలకొంది. ఈ ఏడాది అక్టోబర్ లో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే మాట్లాడుతూ... ఐపీఎల్ కచ్చితంగా జరుగుతుందని, ఆ నమ్మకం తనకుందని చెప్పారు. అయితే, స్టేడియంలలో మాత్రం ప్రేక్షకులు ఉండరని తెలిపారు.
 
మరోవైపు, అక్టోబరు, నవంబరు నెలల్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు కూడా వాయిదాపడ్డాయి. దీంతో ఈ రెండు నెలల వ్యవధిలో ఐపీఎల్ పోటీలు నిర్వహించే అవకాశాలు లేకపోలేదనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృత్రిమ మేధతో మానవాళికి ముప్పుకాదు : మంత్రి నారా లోకేశ్

పాకిస్తాన్ కొత్త చట్టం: పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మారణహోమం చేసినా జీవితాంతం అరెస్ట్ చేయరట

అచ్యుతమ్ కేశవమ్, అలీనగర్‌లో ఆర్జేడీకి షాకిచ్చిన మైథిలీ ఠాకూర్, ఆమె ఎవరు?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : కేంద్ర మాజీ మంత్రిపై బీజేపీ సస్పెండ్

న్యాయం చేయాలంటూ డిఐజిని కలిసేందుకు పరుగులు తీసిన అత్యాచార బాధితురాలు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

తర్వాతి కథనం
Show comments