Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా చెత్త ప్రదర్శనపై ట్రోల్స్.. తనకు సంబంధం లేదన్న అనిల్ కుంబ్లే!!

ఠాగూర్
మంగళవారం, 17 డిశెంబరు 2024 (11:56 IST)
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌లో భాగంగా, భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భారత ఆటగాళ్ల ఆటతీరు అత్యంత చెత్తగా ఉంది. తొలి టెస్టులో బౌలర్ల చలువతో గెలిచిన భారత్.. రెండో టెస్ట్ మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఓటమి అంచుల వుంది. దీంతో భారత ఆటగాళ్ల ప్రదర్శన సోషల్ మీడియా వేదికగా విమర్శలు పేలుతున్నాయి. 
 
ముఖ్యంగా, భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే ఫోటో పేరుతో ఈ విష ప్రచారం సాగుతుంది. దీనిపై అనిల్ కుంబ్లే స్పందించారు. తన పేరు, ఫొటోతో సోషల్ మీడియా కథనాలు రావడంపై స్పందించారు. కొంతమంది తన ఫొటో ఉపయోగించి తమకు తోచిన విధంగా వార్తలు రాయడాన్ని ఆయన ఖండించారు. ఆ వార్తల్లోని వ్యాఖ్యలు, ఆ ఖాతాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని కుంబ్లే 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేశారు.
 
ప్రస్తుతం బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత ఆటగాళ్ల ప్రదర్శనను తప్పుబడుతూ అనిల్ కుంబ్లే వ్యాఖ్యలు చేశారంటూ కొంతమంది ఆయన ఫొటోను ఉపయోగించి నెట్టింట నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారు. కెప్టెన్సీలో రోహిత్ శర్మ వైఫల్యం, బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లి ఘోరంగా విఫలం కావడంపై కుంబ్లే తీవ్ర విమర్శలు చేశాడనేది ఆ వార్తల సారాంశం. దాంతో అవన్నీ నకిలీ వార్తలని, వాటితో తనకేలాంటి సంబంధం లేదని తాజాగా క్లారిటీ ఇచ్చాడు. 
 
ఈ మేరకు కుంబ్లే ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. "కొన్ని సోషల్ మీడియా ఖాతాలు నా ఫొటోను ఉపయోగించి తప్పుడు వ్యాఖ్యలను నాకు ఆపాదిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. ఆ ఖాతాలు, అందులోని వ్యాఖ్యలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. సామాజిక మాధ్యమాల్లో చూసే ప్రతిదాన్ని నమ్మవద్దు. ఏదైనా సమాచారాన్ని పంచుకునే ముందు అది సరైనదో.. కాదో ధ్రువీకరించుకోండి. నా అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మండి. ఇలాంటి వాటి విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నా" అని కుంబ్లే ట్వీట్ చేశాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments