Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుల్వామా దాడి: పాకిస్థాన్‌పై క్రికెటర్ల ఫైర్ (వీడియో)

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (17:25 IST)
పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతి ఏటా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన ఫౌండేషన్‌ ద్వారా అందించే అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో సుమారు 42 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించడం మంచిది కాదని ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కోహ్లీ ట్విటర్‌లో పేర్కొన్నాడు. 
 
అంతేగాకుండా పుల్వామా ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్లు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ ఉగ్రమూకలు 40కి పైబడిన సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకోవడంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. టీమిండియా క్రికెటర్లు కూడా పాక్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

పుల్వామా ఘటనపై టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పాడు. వీరమరణం చెందిన జవాన్ల కోసం దేశ ప్రజలందరూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారన్నాడు. 
 
ఇంకా ఓపెనర్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ఆది నుంచే పాకిస్థాన్.. సరిహద్దుల్లో ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతూ వస్తుందని ఫైర్ అయ్యాడు. పాకిస్థాన్ సర్కార్ ఉగ్రమూకల అణచివేతకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నాడు. ఇకనైనా పాకిస్థాన్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని చెప్పాడు. 
 
అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడాన్ని విని దిగ్భ్రాంతికి గురైయ్యామని తెలిపాడు. ఈ దాడిలో వీర మరణం పొందిన సైనికులకు వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాడు. గాయాలపాలైన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆశించారు. 
 
అదేవిధంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పుల్వామా దాడిపై స్పందించాడు. వీర మరణం పొంది దేశానికి సీఆర్పీఎఫ్ జవాన్లు సేవ చేస్తే.. వారి కుటుంబీకులు వారిని జీవితంతాం కోల్పోయి దేశానికి అతిపెద్ద త్యాగం చేస్తున్నారని తెలిపాడు. జవాన్లపై ఆత్మాహుతి దాడి తీవ్ర వేదనకు గురిచేసిందని.. ఉగ్రమూకలు ఏర్పరిచిన ఈ గాయానికి మందే లేదని డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. 
 
వీరితో పాటు మిగిలిన క్రికెటర్లు కూడా కాశ్మీర్‌లో జరిగిన ఈ దాడిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాడు. ఇంకా ఉగ్రవాదులను కట్టడి చేయడంలో పాకిస్థాన్ మేలుకోవాలని.. లేకుంటే పరిణామాలు వేరేలా వుండే అవకాశం వుందని హెచ్చరిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

తర్వాతి కథనం
Show comments