Webdunia - Bharat's app for daily news and videos

Install App

హల్లో కోహ్లీ... మీ ఆవిడకు మీరైనా చెప్పొచ్చుకదా.. ఏంటాపని?

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (13:03 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, సినీ నటి అనుష్క శర్మపై నెటిజన్లు మండిపడుతున్నారు. జంతు పరిరక్షణ సంస్థ (పెటా)తో చేతులు కలిపి మాంసాహారాన్ని దూరంగా ఉంచాలని ప్రచారం చేస్తోంది. మరోవైపు, నోటి కేన్సర్‌కు కారణమయ్యే పాన్ మసాలా ప్రకటనలో నటించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంతకీ ఈ వివాదం ఏంటో ఓసారి పరిశీలిద్దాం.
 
పాన్ మసాలాలు విక్రయించే రజనీగంధా సంస్థకు సిల్వర్ పర్ల్స్‌ విక్రయ వ్యాపారం కూడా చేస్తోంది. వీటిని ప్రమోట్ చేసే యాడ్‌లో అనుష్క నటిస్తోంది. ఇదే అసలు వివాదానికి కారణమైంది. పాన్ మసాలాలతో ఎంతో మందిని నోటి క్యాన్సర్ల బారిన పడేస్తున్న సంస్థను ప్రమోట్ చేస్తావా? అంటూ అనుష్కపై నెటిజన్లు మండిపడ్డారు. 
 
అదేసమయంలో విరాట్ కోహ్లీ మాత్రం ప్రజలకు కీడు చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేయనని చెబుతుంటే.. అనుష్క మాత్రం ఇలాంటి సుపారీలను ప్రోత్సహిస్తూ మళ్లీ జనాలకు నీతులు చెబుతుందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను అనుష్క తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఇలా రియాక్టయ్యారు. అంతేనా, ఈ యాడ్‌లో నటించవద్దని అనుష్కకు మీరైనా చెప్పండి కోహ్లీ అంటూ మరో నెటిజన్ కోరాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

కేకు కొందామని బేకరీకి వస్తే.. చాక్లెట్ కొనిస్తానని ఆశచూపి అత్యాచారం..

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments