Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సిడ్నీ క్రికెట్ స్టేడియంలో అనుష్కతో కోహ్లీ.. ఇదే నా బెస్ట్ అచీవ్‌మెంట్

సిడ్నీ క్రికెట్ స్టేడియంలో అనుష్కతో కోహ్లీ.. ఇదే నా బెస్ట్ అచీవ్‌మెంట్
, సోమవారం, 7 జనవరి 2019 (13:18 IST)
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా - భారత్ క్రికెట్ చరిత్రలో 72 యేళ్ల టీమిండియా కలను సాకారం చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై 2-1 తేడాతో టెస్ట్ సిరీస్‌ను తన కెప్టెన్సీలో కైవసం చేసుకున్నాడు. ఈ మధురక్షణాలను కోహ్లీ తన భార్య, సినీ నటి అనుష్క శర్మతో కలిసి ఆస్వాదించాడు. 
 
వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయినట్టు అంపైర్లు ప్రకటించిన వెంటనే టీమిండియా జట్టు మైదానంలోకి వచ్చింది. వారితో పాటు కోహ్లీ తనతో పాటు తన సతీమణిని కూడా మైదానంలోకి తీసుకొచ్చి, స్టేడియం మొత్తం కలియతిరుగుతూ సందడి చేశారు. అనుష్క భుజాలపై కోహ్లీ రెండు చేతులు వేసి స్టేడియంలో నడుచుకుంటూ కెమెరాలకు చిక్కాడు.
webdunia
 
ఈ విజయంపై కోహ్లీ స్పందిస్తూ, ఈ విజయం తన జీవితంలో బెస్ట్ అచీవ్‌మెంట్ అంటూ పేర్కొన్నాడు. కాగా, ఈ పర్యటనలో కోహ్లీ ఒక సెంచరీతో పాటు 282 పరుగులు చేసిన విషయం తెల్సిందే. భారత క్రికెట్ జట్టును చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. ఇదివరకు ఎపుడూ ఇలాంటి మూమెంట్‌ను చూడలేదు. టీమిండియాను లీడ్ చేస్తూ ఇలాంటి చారిత్రక విజయం సాధించడం గౌరవంగా భావిస్తున్నా. ఈ క్షణాలను తప్పకుండా మేం ఎంజాయ్ చేస్తాం అంటూ కోహ్లీ వ్యాఖ్యానించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చక్‌ దే ఇండియా : ఆస్ట్రేలియా గడ్డపై మెరిసిన భారత మొనగాళ్లు