Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరల్డ్ కప్ : భారత్ - న్యూజిలాండ్ సెమీస్ పోరు .. ఏపీలో భారీ స్క్రీన్లపై ప్రదర్శన

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (13:58 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో నాకౌట్ పోటీలైన సెమీస్ పోరు జరుగుతుంది. తొలి సెమీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌ను ఏపీలోని మూడు నగరాల్లో భారీ స్క్రీన్లపై లైవ్ టెలికాస్ట్ చేసేలా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏర్పాట్లు చేశారు. విశాఖ, విజయవాడ, కడప నగరాల్లో భారీ స్క్రీన్లపై ఈ లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ఇక్కడ ఒకేసారి ఏకంగా పది వేల మంది కూర్చొని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
విశాఖ ఆర్కే బీచ్‌లో కాళీమాత గుడి ఎదురుగా, విజయవాడలోని మున్సిపల్ స్టేడియం, కడపలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఈ స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో చోట దాదాపు 10 వేల మంది వీక్షించేందుకు వీలుగా ఈ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగనున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

తర్వాతి కథనం
Show comments