Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహాలీ వన్డే : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (13:41 IST)
మొహాలీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో అందరూ ఊహించినట్లుగానే తుదిజట్టులో టీమ్ మేనేజ్‌మెంట్ నాలుగు మార్పులు చేసింది. మహేంద్రసింగ్ ధోనీ, అంబటి రాయుడు, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా స్థానంలో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్ తుదిజట్టులోకి వచ్చారు. 
 
ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. ఆతిథ్య జట్టు విజయం సాధిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది. ఒకవేళ ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఈ నేపథ్యంలో పోరు రసవత్తరంగా సాగనుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. 
 
భారత్ జట్టు: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా. 
 
ఆస్ట్రేలియా జట్టు: ఫించ్, ఖవాజా, షాన్ మార్ష్, హాండ్స్‌కాంబ్, మాక్స్‌వెల్, టర్నర్, అలెక్స్ కేరీ, రిచర్డ్‌సన్, కమిన్స్, బెహ్న్రెడార్ఫ్, జంపా. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments