Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహాలీ వన్డే : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

Webdunia
ఆదివారం, 10 మార్చి 2019 (13:41 IST)
మొహాలీ వేదికగా జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో అందరూ ఊహించినట్లుగానే తుదిజట్టులో టీమ్ మేనేజ్‌మెంట్ నాలుగు మార్పులు చేసింది. మహేంద్రసింగ్ ధోనీ, అంబటి రాయుడు, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా స్థానంలో రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్ తుదిజట్టులోకి వచ్చారు. 
 
ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. ఆతిథ్య జట్టు విజయం సాధిస్తే సిరీస్ భారత్ సొంతమవుతుంది. ఒకవేళ ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఈ నేపథ్యంలో పోరు రసవత్తరంగా సాగనుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. 
 
భారత్ జట్టు: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, భువనేశ్వర్, కుల్దీప్ యాదవ్, చాహల్, బుమ్రా. 
 
ఆస్ట్రేలియా జట్టు: ఫించ్, ఖవాజా, షాన్ మార్ష్, హాండ్స్‌కాంబ్, మాక్స్‌వెల్, టర్నర్, అలెక్స్ కేరీ, రిచర్డ్‌సన్, కమిన్స్, బెహ్న్రెడార్ఫ్, జంపా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments