Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. టీమిండియా పరాజయం

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (21:11 IST)
బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలోనూ టీమిండియా పరాజయం పాలైంది. 272 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. 
 
బొటనవేలి గాయంతో చివరిలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ వృధా అయ్యింది. రోహిత్ శర్మ 28 బంతుల్లో 51 పరుగులు చేసి చివరి వరకు క్రీజులో నిలిచాడు. 
 
రోహిత్ శర్మ గాయం కారణంగా ఆసుపత్రికి వెళ్లడంతో విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలో దిగాడు. అయితే ఐదు పరుగులకే అవుటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ 6 ఫోర్లు, 3 సిక్సులతో 82 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ (56) అర్ధసెంచరీతో రాణించాడు. 
 
అయితే భారత బ్యాట్స్‌మెన్లు ధీటుగా రాణించలేకపోయారు. దీంతో టీమిండియా స్కోర్ 266 పరుగుల వద్ద ఆగిపోయింది. ఫలితంగా బంగ్లాదేశ్ విజయం ఖరారైంది. 
 
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య బంగ్లాదేశ్ 2-0తో విజయం సాధించింది. ఇక ఇరు జట్ల మధ్య మూడో వన్డే నామమాత్రం కానుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 10వతేదీ జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

తర్వాతి కథనం
Show comments