Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోహిత్ శర్మ అభిమానికి రూ.6.5 లక్షల అపరాధం.. ఎందుకో తెలుసా?

rohit sharma fan
, సోమవారం, 7 నవంబరు 2022 (11:41 IST)
ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలు ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్నాయి. ఇప్పటికే లీగ్ మ్యాచ్‌లన్నీ ముగియగా, వచ్చే బుధవారం నుంచి సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. అయితే, ఆదివారం భారత్, జింబాబ్వే జట్ల మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరిగింది. 
 
ఈ మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్రికెట్ వీరాభిమాని భారత కెప్టెన్ రోహిత్ శర్మను చూసేందుకు వచ్చాడు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. దీన్ని గమనించిన భద్రతా సిబ్బంది అతడి వెనుక నుంచి పరుగులుల తీసి మరీ పట్టుకున్నారు. ఈ క్రమంలో రోహిత్‌ను చూడగానే ఆ అభిమాని ఉద్వోగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. 
 
దీన్ని గమనించిన రోహిత్ ఆ అభిమాని వద్దకు పరుగుత్తి మాట్లాడేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఆ అభిమానిని బలవంతగా అక్కడ నుంచి బయటకు తీసుకెళ్లారు. కాగా, మైదానంలో ఆటకు అంతరాయం కలిగించినందుకు ఆ అభిమానికి రూ.6.5 లక్షల అపరాధం విధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ : భారత్ ఘన విజయం - సెమీస్‌లో ఇంగ్లండ్‌తో ఢీ