Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో మృతి చెందిన ప్రతి జర్నలిస్టుకు రూ.5లక్షల పరిహారం: జగన్

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (12:47 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు.. కరోనా ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. ఇప్పటికే కరోనా బారిన ఎంతోమంది ప్రాణాలు విడిచారు. వీరిలో ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు, వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నారు. వైరస్‌ నుంచి ప్రజలను రక్షించేందుకు వీరంతా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా విపత్కర సమయంలో ముందుండి వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను ఆదుకునేందుకు ఏపీ సర్కార్‌ ముందుకొచ్చింది. వైరస్‌పై పోరులో మృతి చెందిన ప్రతి జర్నలిస్టుకు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ అధ్యక్షుడు కె. శ్రీనివాస్‌రెడ్డి ఈ విషయాన్ని మంగళవారం మీడియా ముందు వెల్లడించారు.
 
ఈ సందర్భంగా  శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కరోనా వల్ల ఎంతోమంది మరణిస్తున్నారు. దీనిలో జర్నలిస్టులు కూడా మృత్యువాత పడ్డారు. వార్త సేకరణలో భాగంగా అందరు ముందుండి నడిచారు. ప్రధాని కూడా జర్నలిస్టులు కరోనా వారియర్స్‌ అని తెలిపారు. 
 
జర్నలిస్టులను ప్రభుత్వాలు కూడా సహకారం అందించాలి. 50 లక్షలు బీమా ఇవ్వాలని కోరుతున్నాం. ఏపీలో 38 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి మృతి చెందారు. వారిని ఆదుకోవాలని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము అని అన్నారు. 38 మంది మృతి చెందినట్లు సీఎం జగన్‌ చెప్పారు. మృతిచెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే చికిత్స తీసుకునేవారికి ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి సహకరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments