Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాతో మృతి చెందిన ప్రతి జర్నలిస్టుకు రూ.5లక్షల పరిహారం: జగన్

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (12:47 IST)
కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు.. కరోనా ఎంతోమందిని పొట్టనబెట్టుకుంది. ఇప్పటికే కరోనా బారిన ఎంతోమంది ప్రాణాలు విడిచారు. వీరిలో ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు, వైద్యులు, పోలీసులు, జర్నలిస్టులు ఉన్నారు. వైరస్‌ నుంచి ప్రజలను రక్షించేందుకు వీరంతా తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. 
 
ఈ నేపథ్యంలో కరోనా విపత్కర సమయంలో ముందుండి వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులను ఆదుకునేందుకు ఏపీ సర్కార్‌ ముందుకొచ్చింది. వైరస్‌పై పోరులో మృతి చెందిన ప్రతి జర్నలిస్టుకు రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇండియన్‌ జర్నలిస్టు యూనియన్‌ అధ్యక్షుడు కె. శ్రీనివాస్‌రెడ్డి ఈ విషయాన్ని మంగళవారం మీడియా ముందు వెల్లడించారు.
 
ఈ సందర్భంగా  శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో కరోనా వల్ల ఎంతోమంది మరణిస్తున్నారు. దీనిలో జర్నలిస్టులు కూడా మృత్యువాత పడ్డారు. వార్త సేకరణలో భాగంగా అందరు ముందుండి నడిచారు. ప్రధాని కూడా జర్నలిస్టులు కరోనా వారియర్స్‌ అని తెలిపారు. 
 
జర్నలిస్టులను ప్రభుత్వాలు కూడా సహకారం అందించాలి. 50 లక్షలు బీమా ఇవ్వాలని కోరుతున్నాం. ఏపీలో 38 మంది జర్నలిస్టులు కరోనా బారినపడి మృతి చెందారు. వారిని ఆదుకోవాలని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము అని అన్నారు. 38 మంది మృతి చెందినట్లు సీఎం జగన్‌ చెప్పారు. మృతిచెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే చికిత్స తీసుకునేవారికి ప్రత్యేక బెడ్లను ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి సహకరించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవులపల్లి అమర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments