Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువకులూ తస్మాత్ జాగ్రత్త : కరోనా బాధితుల్లో వారే అధికం..

Webdunia
ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (09:28 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ఇప్పటికే 18 రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపించింది. ఈ వైరస్ బారినపడిన వారిలో అత్యధికంగా యువకులే ఉన్నారు. అయితే, దేశంలో ఇప్పటివరకు చనిపోయిన కరోనా రోగుల్లో ఎక్కువగా వృద్ధులు ఉన్నారు. ఈ విషయాన్ని కేంద్రం తాజాగా వెల్లడించిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 
 
దేశవ్యాప్తంగా మూడువేలకు పైగా కరోనా నిర్ధారిత కేసులు నమోదు కాగా, వారిలో 83 శాతం మంది 60 ఏళ్లలోపు వారే. అందులో 21 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారి సంఖ్యే ఎక్కువ. 60 ఏళ్లు అంతకుమించి వయసు కలిగిన వారు కేవలం 17 శాతం మందే ఈ వైరస్ బారినపడినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
 
మరోవైపు, విదేశాల నుంచి వచ్చిన యువకుల్లో ఎక్కువమందికి ఈ వైరస్ సోకింది. వీరంతా చదువు, ఉద్యోగాల కోసం విదేశాలు వెళ్లినవారే. వీరిలోనూ 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వారి సంఖ్యే ఎక్కువ. వైరస్ బారినపడిన వారిలో ఈ వయసు వారే ఎక్కువని కేంద్రం ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. మొత్తంగా చూస్తే బాధితుల్లో తక్కువగా ఉన్న వృద్ధుల సంఖ్య.. మరణాల్లో మాత్రం ఎక్కువగా ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments