Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు.. అంతే స్పృహతప్పి పడిపోయిన యువతి

Webdunia
శనివారం, 19 జూన్ 2021 (09:41 IST)
కంట్లూరులో కలకలం రేగింది. ఓ యువతికి వైద్య సిబ్బంది ఒకే సారి డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చింది. గుట్టుచప్పుడు కాకుండా యువతిని ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. వ్యాక్సిన్ కోసం అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్‌కు లక్ష్మీ ప్రసన్న (21) వెళ్లారు. ఫోన్ మాట్లాడుతూ ఆమెకు నర్సు పద్మ వెంట వెంటనే రెండు డోసుల వాక్సిన్స్ ఇచ్చారు. వాక్సిన్ అనంతరం కొద్దీ సేపటికే యువతి కళ్ళు తిరిగి పడిపోయారు.
 
వెంటనే ఆమెను వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి యువతిని తరలించారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న ఆరోగ్య పరిస్థితి నిలకడగా వున్నప్పటికి అబ్జర్వేషన్‌లో ఉంచామని వైద్యులు అంటున్నారు. లక్ష్మీ ప్రసన్నకు ఏమి జరుగుతుందోనని కటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
 
విషయం వెలుగులోకి రావడంతో నర్సు నిర్లక్యంపై స్థానికులు మండిపడుతున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నర్సు పద్మను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాక్సిన్ కోసం వెళ్లిన వారిని పట్టించుకోకుండా గంటలు గంటలు ఫోన్లు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments