ఈ విధంగా అయితే కరోనావైరస్ కేసుల్లో భారత్ ఎక్కడికి వెళ్తుందో?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (10:56 IST)
మూడంటే మూడు రోజుల్లో భారతదేశంలో లక్ష కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. ఇలా రెండోసారి జరిగింది. ఈ స్పీడు ఇలాగే సాగితే భారతదేశం కరోనావైరస్ కేసుల సంఖ్యలో ఎంత వేగంతో వెళ్తుందోనన్న ఆందోళన నెలకొని వుంది. పైన పేర్కొన్న పట్టికలో చూడండి మొదటి లక్ష కేసులకు గాను కనీసం 109 రోజుల కాలం పట్టింది. ఆ తర్వాత లాక్ డౌన్ సడలింపుల ఫలితంగా విపరీతంగా పెరిగిపోతున్నాయి.
 
ప్రజల్లో కరోనావైరస్ గురించి ఎంతమాత్రం భయంలేకపోవడం, పట్టింపులేని ధోరణి కారణంగా ఇది పెరుగుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడంలేదు. సామాజిక దూరం పాటించడంలేదు. మాస్కులు వేసుకోవడంలేదు. ఎవరో కొంతమంది తప్ప మిగిలినవారంతా ఎలాంటి సురక్షిత పద్ధతులు పాటించకుండా మిగిలినవారి ప్రాణాల మీదికి తెస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు కరోనావైరస్ పట్ల అప్రమత్తంగా వుండాలి. లేదంటే పరిస్థితులు చేయిదాటితే చికిత్స చేసేందుకు ఆసుపత్రుల్లో ఖాళీ వుండదు. రోగులను చూసేందుకు వైద్యులు అందుబాటులో వుండరు.
 
గడిచిన 24 గంటల్లో భారత్‌లో 34,956 కేసులు నమోదు కాగా 687 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ తెలియజేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల మేరకు దేశంలో మొత్తం 10,03,832 కేసులు నమోదయ్యాయి. ఇందులో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3,42,473గా ఉండగా 6,35,756 మంది చికిత్స నిమిత్తం కోలుకొని డశ్చార్జ్ అయ్యారు.
 
ఇదిలా ఉండగా 25,602 మంది కరోనా వ్యాధితో మరణించారు. దేశవ్యాప్రంగా నిన్న 3,33,228 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 1,30,72,718 మందికి కరోనా టెస్టులు చేసినట్లు వెల్లడించింది. ఇక దేశంలో కరోనా నుండి కోలుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 63 శాతం రికవరీ రేటు ఉందని కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అలాంటి బుర్ర వున్నవాడితో పిల్లల్ని కంటే కష్టమే, అందుకే వదిలేసా: మృణాళ్ ఠాకూర్

Winter: పూజా కార్యక్రమాలతో వింటర్ చిత్రం ప్రారంభం

దేవగుడి విజయం సాధించడం సంతోషంగా ఉంది - బెల్లం రామకృష్ణారెడ్డి

15 మిలియన్ ఫ్లస్ వ్యూస్ తో విజయ్ దేవరకొండ రణబాలి గ్లింప్స్

ఊహించలేనన్ని ట్విస్ట్‌లతో బరాబర్ ప్రేమిస్తా సినిమా ఉంటుంది .. చంద్రహాస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments