Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్మార్గానికి పరాకాష్ట.. డబ్బులు గుంజేస్తున్న ఆంబులెన్స్ డ్రైవర్లు.. 40కి.మీలకు 17వేలా?

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (13:35 IST)
Ambulance
కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలో కరోనా రోగుల పట్ల అంబులెన్స్ డ్రైవర్లు దారుణంగా వ్యవహరిస్తున్నారు. భారీగా డబ్బులు గుంజేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్‌లో వెలుగు చూసింది. సంక్షోభం వేళ కాసుల వేట మొదలు పెట్టారు దుర్మార్గులు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని 40 కిలోమీటర్లు తరలించేందుకు రూ. 17 వేలు ఛార్జ్ చేశాడు ఓ అంబులెన్స్ డ్రైవర్. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాడు బాధిత వ్యక్తి తనయుడు. ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలను ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుభోదీప్ సేన్ తండ్రి అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దాంతో అతను తన తండ్రిని ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు కాల్ చేశాడు.
 
అసన్‌సోల్ నుంచి దుర్గాపూర్‌కు దాదాపు 40 కిలోమీటర్లు అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. అయితే అంబులెన్స్ ఆపరేటర్.. సుభోదీప్ సేన్ కి ఊహించని షాక్ ఇస్తూ ట్రావెలింగ్ ఛార్జి కింద రూ. 17 వేలు డిమాండ్ చేశాడు. దాంతో చేసేదేమీ లేక డ్రైవర్ అడిగిన మొత్తాన్ని సుభోదీప్ సేన్ చెల్లించాడు.

అయితే, అంబులెన్స్ ఆపరేటర్ దోపిడీపై అనుదీప్ మీడియాను ఆశ్రయించాడు. అలాగే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రధాన అధికారికి ఫిర్యాదు కూడా చేశాడు. కష్టకాలం ఉంటే ఇలాంటి దోపిడీ ఏంటని ఆవేదన వ్యక్తం చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments