Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెవి దగ్గర గుసగుసలాడవద్దు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (19:59 IST)
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. అయితే రాజ్యసభలో సభ్యులకు చైర్మన్ వెంకయ్యనాయుడు కీలక సూచనలు చేశారు. కరోనా రాకుండా ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు ఖచ్చితంగా అనుసరించాలని వెంకయ్యనాయుడు సభ్యులను కోరారు.
 
ఎవరికి కేటాయించిన సీట్లలో వారు కూర్చోవాలని తెలిపారు. ఎవరు కూడా తమ స్థానాలను వదిలి వెళ్లొద్దని తెలిపారు. దీంతో పాటు చెవిలో వంగి గుసగుసలాడవద్దని కూడా విజ్ఞప్తి చేసారు. ఇలా చేయడం మానుకోవాలని ఇతర సభ్యులతో ఏదైనా చెప్పాలనుకుంటే దానిని స్లిప్ మీద రాసి ఇవ్వాలని తెలిపారు.
 
అలాగే సభ్యులెవరూ తమ కార్యాలయానికి రావద్దని తెలిపారు. కలవాలని తమకు ఉన్నా ప్రస్తుత పరిస్థితి రీత్యా భద్రతా ప్రమాణాలు అనుసరించాలని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజ్యసభ సమావేశాలు ఎన్నడూ లేని రీతిలో జరుగుతున్నాయి. కరోనా నియమాలు పాటించి సీటింగ్ అరేంజ్ చేశారు. అలాగే మాస్కులు తప్పనిసరి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments