Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారణాసి : శివలింగానికి కరోనా వైరస్ సోకుతుందనీ... మాస్క్ కట్టిన పూజారి!

Webdunia
మంగళవారం, 10 మార్చి 2020 (13:01 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో ఓ విచిత్ర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న వారణాసిలో ఉన్న ఓ ఆలయంలో శివలింగానికి పూజారి మాస్క్ వేశారు. కరోనా వైరస్ కారణంగానే ఈ మాస్క్ వేసినట్టు పూజారి చెబుతున్నాడు. పైగా, శివలింగాన్ని ఎవరూ తాకొద్దని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
తన చర్యపై ఆ పూజారి స్పందిస్తూ, దేవుడికి కరోనా వైరస్‌ సోకుతుందనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌పై అవగాహన కల్పించేందుకే శివలింగానికి మాస్క్‌ వేశామని పూజారి కృష్ణ ఆనంద్‌ పాండే స్పష్టం చేశారు. ఇక ఆలయానికి వచ్చే భక్తులు కూడా మాస్క్‌లు ధరించి వచ్చి తమ ఇష్టదైవాన్ని దర్శనం చేసుకుంటున్నారు. మొత్తంమీద పూజారి చేసిన పనికి భక్తులు కూడా ఒక్కసారి అవాక్కయ్యారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments