దేశ వ్యాప్తంగా 15-18 యేళ్ల లోపు యువతకు వ్యాక్సినేషన్ ప్రారంభం

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (13:16 IST)
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి 15-18 యేళ్ల లోపు చిన్నారులకు కరోనా  వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందుకోసం ఆయా రాష్ట్రాలు ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అలాగే, రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేశాయి. అయితే, ఏదేని ఒక గుర్తింపు కార్డు ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసి, టికా వేస్తారు. 
 
పెద్దలకు ఇచ్చినట్టుగానే చిన్నారులకు కూడా రెండు డోసుల టీకాను ఇవ్వనున్నారు. మొదటి డోస్ వేసిన 28 రోజుల తర్వాత రెండో డోస్ టీకా వేస్తారు. టీకా వేసుకునేవారిలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులే అధికంగా ఉన్నారు. 
 
దీనిపై ఆరోగ్య శాఖ అధికారులు స్పందిస్తూ, చిన్నారులకు కరోనా టీకాలు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే, పిల్లల ఆధార్ కార్డు, ఐడీ కార్డులను తప్పనిసరిగా తీసుకుని రావాలని వారు కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Regina Cassandra: వీడియోగ్రాఫర్ కు రెజీనా కాసండ్ర క్లాస్ తీసుకుంది

Allu Sirish: దుబాయ్‌లో శిరీష్ ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Mahesh Babu: రాజమౌళికి ఓకే అనిపించడం అంత ఈజీ కాదు : మహేష్ బాబు

ఆనంద్ దేవరకొండ చీకటి లోకంలో దేనికోసం నీ వెతుకులాటా?

Sharwanand: బైకర్ ఇంజన్ సిద్దమైంది. రేపు గ్లింప్స్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

తర్వాతి కథనం
Show comments