Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం... వైకాపా నేతల అరాచకం

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (12:49 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోట్లాది మంది తెలుగు ప్రజలు ఆరాధ్యదైవం, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్.టి.రామారావు విగ్రహాన్ని వైకాపా నేత ఒకరు ధ్వంసం చేశారు. ఈ దాడి ఘటన గుంటూరు జిల్లా దుర్గి గ్రామంలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మేల్కొన్న పోలీసులు... కేసు నమోదు చేసిన విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
అయితే, ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం ఘటన ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి చర్యలకు పాల్పడటం దారుణని, ఈ చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జింపచేసిన మన అన్నగారు ఎన్టీఆర్ మహాపురుషుడని కీర్తించారు. అలాంటి మహనీయుని విగ్రహాన్ని ధ్వంసం చేయడం తెలుగు జాతిని అవమానపరిచినట్టేనని చెప్పారు. 
 
మరోవైపు, గుంటూరు జిల్లా కారంపూడి మండలం ఒప్పిచర్లలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనకు దిగారు. మాచర్ల టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి నేతృత్వంలో ఈ ధర్నా చేయగా, వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments