Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పేషెంట్ల కోసం రోజుకు రెండు సినిమాలు: ప్రభుత్వ విప్ చెవిరెడ్డి

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (21:11 IST)
ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఏర్పాటు చేసిన "కోవిడ్ - 19 కేర్ సెంటర్"లో కరోనా పేషంట్ల మానసిక ఉపశమనం కోసం రోజుకు రెండు సినిమాల ప్రదర్శించేందుకు నిర్ణయించారు.

తన సొంత నిధులతో టీవీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. కరోనా బారిన పడ్డామనే మానసిక ఆందోళన పేషంట్లలో నెలకొనకుండా ఉండేందుకు ఈ విధానం దోహదపడుతుందని చెవిరెడ్డి పేర్కొన్నారు. అలాగే మెదడుకు పదునుపెట్టి ఉత్సాహాన్ని నింపే ఇండోర్ గేమ్స్ చెస్, క్యారమ్స్ ఏర్పాటు చేశారు.

మనో వికాసానికి దోహదం చేసే పుస్తక పఠనం ఏర్పాటు చేశారు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటివి అమలుకు చర్యలు చేపట్టారు. అంతే కాకుండా తన సొంత నిధులతో కోవిడ్ కేంద్రానికి వచ్చే పేషంట్‌కు అవసరమైన 32 వస్తువులు పేస్ట్, బ్రష్, దుప్పటి, ప్లేట్, గ్లాస్ వంటి వాటితో కూడిన కిట్‌ను అందజేస్తున్నారు. ఇలా కరోనా బాధితుల గురించి అన్ని విధాలా ఆలోచిస్తూ సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ చెవిరెడ్డి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

సంబంధిత వార్తలు

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments