కరోనా పేషెంట్ల కోసం రోజుకు రెండు సినిమాలు: ప్రభుత్వ విప్ చెవిరెడ్డి

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (21:11 IST)
ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సరికొత్త ఆవిష్కరణలకు కేంద్రంగా నిలుస్తున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఏర్పాటు చేసిన "కోవిడ్ - 19 కేర్ సెంటర్"లో కరోనా పేషంట్ల మానసిక ఉపశమనం కోసం రోజుకు రెండు సినిమాల ప్రదర్శించేందుకు నిర్ణయించారు.

తన సొంత నిధులతో టీవీ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. కరోనా బారిన పడ్డామనే మానసిక ఆందోళన పేషంట్లలో నెలకొనకుండా ఉండేందుకు ఈ విధానం దోహదపడుతుందని చెవిరెడ్డి పేర్కొన్నారు. అలాగే మెదడుకు పదునుపెట్టి ఉత్సాహాన్ని నింపే ఇండోర్ గేమ్స్ చెస్, క్యారమ్స్ ఏర్పాటు చేశారు.

మనో వికాసానికి దోహదం చేసే పుస్తక పఠనం ఏర్పాటు చేశారు. మానసిక ప్రశాంతత కోసం యోగా, ధ్యానం వంటివి అమలుకు చర్యలు చేపట్టారు. అంతే కాకుండా తన సొంత నిధులతో కోవిడ్ కేంద్రానికి వచ్చే పేషంట్‌కు అవసరమైన 32 వస్తువులు పేస్ట్, బ్రష్, దుప్పటి, ప్లేట్, గ్లాస్ వంటి వాటితో కూడిన కిట్‌ను అందజేస్తున్నారు. ఇలా కరోనా బాధితుల గురించి అన్ని విధాలా ఆలోచిస్తూ సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ చెవిరెడ్డి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments