ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు ఒమిక్రాన్ కేసులు

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (10:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఈ నెల 20వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ నిర్ధారణ అయింది. ఈయన ప్రకాశం జిల్లా వాసి. అలాగే, మరో వ్యక్తికి కూడా ఈ వైరస్ సోకింది. ఈ నెల 16వ తేదీన సౌతాఫ్రికా నుంచి హైదరాబాద్‌కు అక్కడ నుంచి ఒంగోలుకు వచ్చిన ఈ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఈ రెండు కేసులో కొత్తగా వెలుగు చూశాయి. దీంతో వీరిద్దరితో కాంటాక్ట్ అయిన సెకండరీ కాంటాక్ట్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే, అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. 
 
422కు చేరిన ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల మేరకు ఇప్పటివరకు మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 422కు చేరింది. అలాగే, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,987కు చేరుకుంది. ఇదిలావుంటే, ఈ వైరస్ బారినపడి మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 162కు చేరింది. 
 
ఇకపోతే, ఈ వైరస్ నుంచి 7,091 మంది కోలుకున్నారు. మరో 162 మంది మృత్యువాతపడ్డారు. ఒమిక్రాన్ వైరస్ బారినపడిన వారిలో 130 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 76,766 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే, ఇప్పటివకు దేశంలో కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,79,682కు చేరింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

GLP-1 థెరపీకి వారానికి చికిత్స ఖర్చు రూ. 325 ఖర్చు, ఎలా?

జైడస్ బహుళ-మోతాదుల పెన్ పరికరంలో సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌

ఎండు ద్రాక్షను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

కంటెంట్, వాణిజ్యాల సమ్మిళిత ప్రపంచంలో జీవిస్తున్నజెన్ ఆల్ఫా వెల్లడించిన ఏఎస్‌సీఐ అధ్యయనం

తర్వాతి కథనం
Show comments