Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఆర్ఎస్‌లో కరోనా కలకలం: కేశవరావుకు పాజిటివ్

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (18:33 IST)
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే సామాన్యుల నుంచి సెలెబ్రిటీ వరకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా టీఆర్ఎస్‌లో కరోనా కలకలం రేగింది. టిఆర్‌ఎస్ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యులు కేశవరావుకు కరోనా సోకింది. కాస్త అనారోగ్యంగా వుండటంతో కరోనా పరీక్ష చేయించుకున్న ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 
 
కానీ ప్రస్తుతం కేకే ఆరోగ్య పరిస్థితికి ఎలాంటి సమస్య లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో వుండాలని డాక్టర్లు సూచించారు. దీంతో తన నివాసంలోనే ఉంటూ ఎంపి కేశవరావు చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.
 
ఇటీవలే పార్లమెంటు సమావేశాలు ముగియడంతో కేశవరావు దేశ రాజధాని న్యూఢిల్లీ నుండి హైదరాబాద్‌కు వచ్చారు. కానీ సమావేశాల సమయంలో ఢిల్లీలోనే వున్న ఆయన సహచర ఎంపీలు, రాష్ట్ర మంత్రుల బృందంతో కలిసి కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌ని కలిశారు. దీంతో కేకేకు సన్నిహితంగా వున్న వారు కరోనా టెస్టులు చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

కార్తిక్ రాజు హీరోగా అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే చిత్రం ప్రారంభమైంది

మెగాస్టార్ చిరంజీవి 157 చిత్రం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments