Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Omicron సునామీలా విరుచుకుపడుతుంది : #WHO చీఫ్ సైంటిస్ట్

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (18:32 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వైరస్ సునామీలా విరుచుకుపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. అందువల్ల ఈ వైరస్‌ను అంత తేలిగ్గా తీసుకోరాదని కోరారు. భారత్‌లో ఇప్పటికే 1200కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం భారత్‌లో ఒమిక్రాన్ కేసులు సాధారణంగానే ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు దేశంలో ఉప్పెనలా పెరగనున్నాయని తెలిపారు. చాలా మంది అనారోగ్యానికి గురవుతారని చెప్పారు. ఇదే జరిగితే భారత్‌లో మాత్రం మరోమారు వైద్య సేవల కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. 
 
అలాగే, ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసుల సంఖ్యతో పాటు.. ఆస్పత్రుల్లో చేరే ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరిగిందన్నారు. అందువల్ల అన్ని దేశాలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ముఖ్యంగా, ఈ వైరస్‌ను ప్రతి  ఒక్కరూ సాధారణ జలుబులా తీసుకుంటున్నారని, ఇదే పెను ముప్పుకు దారితీస్తుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments