దేశంలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (12:33 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. వరుసగా రెండో రోజు 12 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా గణాంకాలను వెల్లడించింది. 
 
గురువారం 5.19 లక్షల మందికి పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 12,847 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. కరోనా పాజిటివిటీ రేటు రెండు శాతంపైనే కొనసాగుతోంది. మహారాష్ట్ర(4,255), కేరళ(3,419), దిల్లీ(1,323), కర్ణాటక(833), తమిళనాడు, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. 
 
క్రియాశీల కేసులు రోజురోజుకూ గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 63,063కి చేరింది. దీంతో మొత్తం కేసుల్లో బాధితుల వాటా 0.15 శాతానికి పెరిగింది. నిన్న 7,985 మంది కోలుకోగా.. రికవరీ రేటు 98.64 శాతానికి తగ్గిపోయింది. 24 గంటల వ్యవధిలో 14 మంది మరణించారు. నిన్న 15.27 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా 195.8 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయినట్లు కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి పేరుతో రూ.9 కోట్లు మోసం.. బిగ్ బాస్ అషురెడ్డిపై కేసు

Wala 2: మంచి సినిమాకి ఎలాంటి సరిహద్దులు ఉండవు : సాయి దుర్గతేజ్, నిఖిల్

Tamil movies hava::వేసవిలో తెలుగు భారీ చిత్రాలు లేకపోవడంతో తమిళ చిత్రాలదే హవా

Suri: మండాడి షూటింగ్ పూర్తి - శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు

King of Pop Review: కింగ్ ఆఫ్ పాప్ నెటిజన్ల రివ్యూ - మైఖేల్ జాక్సన్ బయోపిక్ ను అల్లు అర్జున్ చేస్తాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

ప్రపంచ మలేరియా దినోత్సవం- గర్భధారణ సమయంలో మలేరియా.. గుర్తించకపోతే...?

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments