Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు, 24 గంటల్లో 3,712

Covid test
, గురువారం, 2 జూన్ 2022 (14:35 IST)
కరోనా కేసులు మరోసారి దేశాన్ని వణికిస్తున్నట్లు అనిపిస్తోంది. గత 24 గంటల్లో 3,712, కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. గురువారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,64,544 కు చేరుకుంది. గత 24 గంటల్లో 5 తాజా మరణాలు కూడా నమోదయ్యాయి. కరోనావైరస్ కారణంగా దేశంలో మొత్తం మరణాల సంఖ్య 52,4641కు చేరుకుంది.

 
యాక్టివ్ కేసులు 19,509గా వుండగా మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.03 శాతంగా ఉంది. అయితే జాతీయ COVID-19 రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా, గత 24 గంటల్లో 2,584 రికవరీలు నమోదయ్యాయి. దీనితో మొత్తం రికవరీల సంఖ్య 4,26,20,394కి పెరిగింది. టీకాల విషయంలో దేశవ్యాప్తంగా టీకాల డ్రైవ్‌ను ప్రభుత్వం నిరంతరం వేగవంతం చేస్తోంది. ఇప్పటివరకు 85.13 కోట్ల పరీక్షలు జరిగాయి. గత 24 గంటల్లో మొత్తం 4,41,989 పరీక్షలు నిర్వహించారు.

 
“దేశవ్యాప్తంగా కొనసాగుతున్న టీకా డ్రైవ్‌లో భారతదేశం ఇప్పటివరకు 193.70 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అందించింది” అని మంత్రిత్వ శాఖ డేటా తెలిపింది. రాష్ట్రాలు/యుటిలకు ఇప్పటివరకు 193.53 కోట్ల కంటే ఎక్కువ వ్యాక్సిన్ డోసులు అందించబడ్డాయి. 15.16 కోట్లకు పైగా బ్యాలెన్స్, ఉపయోగించని కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఇప్పటికీ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలలో అందుబాటులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంక్ మేనేజర్ కాల్చివేత: జమ్మూకాశ్మీరులో వణుకుతున్న గవర్నమెంట్ ఉద్యోగులు