Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో గణనీయంగా తగ్గిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (11:08 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2756 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 25 మంది చనిపోయారు. 
 
ఈ కొత్త కేసులతో కలుపుకుంటే దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,4ీ6,12,013కు చేరింది. క్రియాశీలక కేసుల సంఖ్య 658 తగ్గి 28,593గా నమోదైంది. 
 
ఆదివారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరోవైపు కొత్తగా మహమ్మారి బారిన పడి 21 మంది మరణించారు. రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది.
 
రోజువారీ పాజిటివిటీ రేటు 1.15 శాతంగా ఉంది. అదే వీక్లీ పాజిటివిటీ రేటు 1.28 శాతంగా నమోదైంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 218.97 కోట్ల కరోనా వ్యాక్సిస్‌ డోసుల్ని పంపిణీ చేశారు. 
 
గత 24 గంటల్లో నమోదైన మరణాల్లో ఒక్క కేరళలోనే 16 మంది ఉండటం గమనార్హం. మహారాష్ట్రలో ఇద్దరు, ఢిల్లీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఒక్కరు చొప్పున మరణించారు. ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments