Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ రైళ్లకు మరో ప్రమాదం.. 5 గంటలు ఆగిన రైలు

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2022 (10:45 IST)
భారతీయ రైల్వే శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. మొన్నటికిమొన్న గాంధీ నగర్ - ముంబై రైలు వరుసగా గురు, శుక్రవారాల్లో ప్రమాదాలకు గురైంది. తొలు రోజున గేదెలను ఢీకొనగా, మరుసటి రోజున గోవులను ఢీకొట్టింది. 
 
తాజాగా శనివారం ఢిల్లీ నుంచి వారణాసి బయలుదేరిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సాంకేతిక సమస్యతో ఆగిపోయింది. ఈ రైలు మార్గమధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ సమీపాన రైల్లోని సీ8 కోచ్‌కు సంబంధించిన ట్రాక్షన్‌ మోటారులో బేరింగు పనిచేయలేదు. దీంతో చక్రాలు దెబ్బతిని మొరాయించాయి. 
 
క్షేత్ర సిబ్బంది ఈ లోపాన్ని గుర్తించి రైల్వే ఆపరేషన్స్‌ కంట్రోల్‌ వ్యవస్థను అప్రమత్తం చేశారు. దీంతో రైలును నియంత్రిత వేగంతో 20 కి.మీ. దూరంలో ఉన్న ఖుర్జా రైల్వేస్టేషన్‌కు తీసుకువెళ్లి ఆపారు. అక్కడ 5 గంటలపాటు మరమ్మతులు చేసినా ఫలితం లేకపోయింది. మొత్తం 1,068 మంది ప్రయాణికులను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోకి తరలించి గమ్యస్థానాలకు చేర్చినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ నటుడు షిహాన్ హుస్సేని మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments