దేశంలో భారీగా తగ్గిన కొత్త కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (10:39 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా అదుపులోకి వచ్చింది. స్వల్ప హెచ్చుతగ్గులతో గత కొద్ది రోజులుగా కొత్తగా నమోదయ్యే కోవిడ్ కేసుల సంఖ్య పది వేలకు దిగువనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
తాజాగా 1.84 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 5,221 మందికి కరోనా సోకినట్లు కేంద్రం సోమవారం వెల్లడించింది. పాజిటివిటీ రేటు 2.8 శాతంగా నమోదైంది. 24 గంటల వ్యవధిలో 5,975 మంది కొవిడ్ నుంచి కోలుకొన్నారు. వైరస్‌ వ్యాప్తి కట్టడిలో ఉండటంతో క్రియాశీల కేసులు 47,176(0.11 శాతం)కి తగ్గిపోయాయి. 
 
కాగా, గత 2020 ప్రారంభం నుంచి 4.45 కోట్ల మంది మహమ్మారి బారినపడగా 98.71 శాతం మంది వైరస్‌ను జయించారు. 5,28,165 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 215 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి. ఆదివారం 30.76 లక్షల మంది టీకా తీసుకున్నారని కేంద్రం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

తర్వాతి కథనం
Show comments