ఏపీలో బాగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (19:01 IST)
ఆంధ్ర్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 18,601 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయగా, వీరిలో 1,597 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో అత్యధిక కేసులో తూర్పు గోదావరి జిల్లాలో 478 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 220, గుంటూరులో 144, చిత్తూరులో 123, కడపలో 117, విజయనగరం జిల్లాలో 100 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో కేవలం 15 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అదేసమయంలో కరోనా వైరస్ నుంచి 8766 మంది బాధితులు కోలుకున్నారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలుపుకుంటే ఏపీలో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన కోవిడ్ బాధితుల సంఖ్య 14,672కు చేరింది. రాష్ట్రంలో 62,395 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరంతా వివిధ ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతీ చోటా రాకాస కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది : నిహారిక కొణిదెల

Suriya : సూర్య చిత్రం కరుప్పు కు తెలుగు టైటిల్ వీరభద్రుడు గా ఖరారు

Vijay Deverakonda: వారి గత జన్మలలోని వివాహ చిత్రం గా రణబాలి : రాహుల్ సంకృత్యన్

కొత్త కోణంలో ఇచట లవ్ అమ్మబడును కొనబడును చిత్రం రివ్యూ

ఆహా ఓటీటీ మిస్టికల్ థ్రిల్లర్ సిరీస్ పోచమ్మ గ్లింప్స్ రిలీజ్ చేసిన బుచ్చిబాబు సాన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడని పండ్లు, ఏంటవి?

హైదరాబాద్‌లో ట్రామా- ఎమర్జెన్సీ మెడిసిన్‌పై జాతీయ సదస్సును ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా

యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఫుడ్స్

Tulsi water, ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే?

జింజిర్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments