Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో పెరిగిన పాజిటివ్ కేసులు - తగ్గిన మరణాలు

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (10:08 IST)
దేశంలో కొత్తగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగాయి. అదేసమయంలో కరోనా మరణాలు మాత్రం తగ్గాయి. ఇటీవల 20వేల దిగువకు పడిపోయిన కొత్త కేసులు.. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 15.20 లక్షల మందికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 26,727 మందికి పాజిటివ్‌గా తేలింది. 
 
క్రితం రోజు నమోదైన కేసుల(23,529)తో పోలిస్తే దాదాపు 3 వేల కేసులు ఎక్కువ కావడం గమనార్హం. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.37కోట్లు దాటింది. కొత్త కేసుల్లో సగానికి పైగా ఒక్క కేరళలోనే నమోదయ్యాయి. అక్కడ నిన్న 15,914 మంది వైరస్‌ బారిన పడగా.. 122 మరణాలు చోటుచేసుకున్నాయి. 
 
మరోవైపు, కేసులు పెరుగుతున్నప్పటికీ మరణాలు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిస్తోంది. గురువారం దేశవ్యాప్తంగా 277 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా.. ఇప్పటివరకు 4,48,339 మందిని వైరస్‌ బలితీసుకుంది. ఇక, మరోసారి కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. 
 
గడిచిన 24 గంటల్లో మరో 28,246 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య 3.30కోట్లు దాటింది. రికవరీ రేటు 97.86శాతానికి చేరింది. అటు క్రియాశీల కేసులు కూడా మరింత తగ్గాయి. ప్రస్తుతం దేశంలో 2,75,224 మంది కరోనాతో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 0.82శాతానికి పడిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments