Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భయం' అంటే ఇదే జగన్‌ రెడ్డి .. పవన్‌కు భయపడి రాత్రికి రాత్రే రోడ్డు వేశారు...

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (10:03 IST)
ఏపీలో అధికార వైకాపా నేతలకు భయం అంటే ఏంటో చూపిస్తానంటూ జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అమరావతి వేదికగా హెచ్చరించారు. నిజంగానే ఆయన హెచ్చరికలకు ఏపీ ప్రభుత్వ అధికారులు వణికిపోతున్నట్టున్నారు. 
 
అందుకే తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ రహదారికి రాత్రికి రాత్రే మరమ్మతు పనులు చేపట్టారు. గురువారం రాత్రి నుంచి ఈ పనులు ప్రారంభించారు. ముందుగా గుంతల్లో వ్యర్థాలను తొలగించి శుభ్రపరిచారు. ఈ గుంతల్లో సిమెంట్ కాంక్రీట్ వేయనున్నట్టు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. 
 
కాగా, ఈ రోడ్డు అధ్వాన్నంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారడంతో ఈ నెల 2వ తేదీ గాంధీ జయంతి రోజున శ్రమదానం చేసి రోడ్డు వేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇందుకోసం ఆయన 2న కాటన్ బ్యారేజీ వద్దకు రానున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రాత్రికిరాత్రే మరమ్మతు పనులు ప్రారంభించారు.
 
దీనిపై జనసేన పార్టీకి చెందిన ఓ విభాగం భయం అంటే ఇదీ జగన్ రెడ్డి అంటూ ఓ ట్వీట్ చేసింది. "బ్యారేజిపై రోడ్లెసేందుకు అనుమతి ఇవ్వం రూల్స్ ఒప్పుకోవు, రాష్ట్రంలో రోడ్లు బాగానే ఉన్నాయన్నారు, జనసేన వారే గుంతలు తీసారని గ్రామ సింహాలతో గొంకారాలు చేయించారు. చివరికి పవన్ కళ్యాణ్‌కు భయపడి రాత్రికి రాత్రి రోడ్డు వేశారు" అంటూ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments