Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో 20 లక్షలు దాటిన మొత్తం పాజిటివ్ కేసులు - తెలంగాణాలో ఎన్ని?

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (19:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసు సంఖ్య 20 లక్షలు దాటేశాయి. గడిచిన 24 గంటల్లో మరో 1435 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 20,00,038కు చేరుకున్నాయి. ఇందులో మొత్తం 19,70,864 మంది కోలుకున్నారు. ఇంకా 15,472 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
 
ఇకపోతే, గడిచిన 24 గంటల్లో వైరస్‌ బారినపడిన వారిలో 1,695 మంది కోలుకున్నారు. ఇన్ఫెక్షన్‌ కారణంగా ఆరుగురు మరణించారు. మొత్తం మరణాలు 13,702కు చేరాయి. శుక్రవారం 69,173 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

అలాగే, తెలంగాణలో కరోనా ఉధృతి తగ్గింది. రాష్ట్రంలో శుక్రవారం కొత్తగా 359 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 494 మంది కోలుకున్నారు. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 
 
రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 6,54,394కు పెరిగాయి. వీరిలో ఇవాళ్టివరకు 6,43,812 మంది కోలుకున్నారు. మరో 6,728 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో మొత్తం మరణాలు 3,854కు పెరిగాయి. ఇవాళ 73,899 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments