Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో కొత్తగా 7,774 పాజిటివ్ కేసులు - ఆంక్షల దిశగా దేశాలు

Webdunia
ఆదివారం, 12 డిశెంబరు 2021 (10:31 IST)
దేశంలో కొత్తగా మరో 7,774 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం ఒక ప్రకటనను విడుదల చేసింది.
 
ఈ బులిటెన్ మేరకు.. 24 గంటల్లో 7,774 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో 8,464 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రులు, క్వారంటైన్లలో 9,2281 మంది చికిత్స పొందుతున్నారు. 
 
ఇదిలావుంటే, దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకు 4,75,434 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 3,41,22,795 మంది కోలుకున్నారు. అలాగే, ఇప్పటివరకు 132,93,84,230 మందికి కరోనా టీకాలు వేశారు.
 
భయపెడుతున్న ఒమిక్రాన్ - ఆంక్షల దిశగా దేశాలు  
 
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వైరస్ ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. దీంతో అనేక దేశాలు భయం గుప్పెట్లోకి వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా, పలు రకాలైన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎట్-రిస్క్ దేశాల నుంచే వచ్చే ప్రయాణికులపై కఠిన నిఘాను సారించారు. ఇపుడు సరికొత్త ఆంక్షలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 
 
నిజానికి ప్రపంచంలో మారణహోమాన్ని సృష్టించిన కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోయింది. ప్రాణహానితో పాటు ఆర్థిక రంగాలపై తీవ్రప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కరోనా వైరస్ వ్యాప్తికి అనేక రకాలైన కఠిన ఆంక్షలను అమలు చేసింది. 
 
ఇపుడు ఒమిక్రాన్ వైరస్ భయపెడుతుండటంతో మరోమారు ఆంక్షలు విధించేందుకు నిర్ణయించింది. ముఖ్యంగా, ప్రతి ఒక్కరికీ మాస్కులు తప్పనిసరి చేయాలని యోచిస్తుంది. అయితే కేసులు, ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యను దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 
 
మరోవైపు, బ్రిటన్ కూడా ఆంక్షలు విధించింది. కానీ, ఈ ఆంక్షలను అధికారులు యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు బోరిస్ జాన్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండోర్ ప్రాంతాల్లో కూడా మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీచేశారు.
 
ఇకపోతే సౌత్ కొరియాలో 7 వేకు పైగా కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒక్కరోజే ఏకంగా 7 వేల వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వ్యాప్తి అదుపులోకి రాకపోతే కఠిన ఆంక్షలు అమలు చేసే దిశగా ఆలోచన చేస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments