Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 19 వేల కరోనా పాజిటివ్ కేసు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (13:24 IST)
దేశంలో కొత్తగా మరో 19 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 19,637 మందికి కోవిడ్-19 సోకిందని తెలిపింది.
 
దీంతో బాధితుల సంఖ్య 4,40,19,811కి చేరింది. గడిచిన 24 గంటల్లో 19,336 మంది కోలుకుని ఇంటికి చేరుకోగా.. ప్రస్తుతం 1,43,676 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కారణంగా 45 మరణాలతో, మరణాల సంఖ్య 5,26,357కు పెరిగింది. ఈ మేరకు నివేదికలో పేర్కొంది.
 
ఇదిలావుంటే, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు మరోమారు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వెల్లడించింది. జూలై 21వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారించారు. అతను ఇప్పటికే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌ను కూడా వేయించుకున్నారు. 
 
అయినప్పటికీ ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ నెల 27న జో బిడెన్‌కు పరీక్షలు నిర్వహించి ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఈ సందర్భంలో, బిడెన్‌కు ఈ రోజు (జూలై 31) మళ్లీ కోవిడ్ సోకినట్లు నిర్ధారించబడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mokshagna: 30వ ఏట మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ.. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రెడీ

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments