Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా మరో 19 వేల కరోనా పాజిటివ్ కేసు

Webdunia
ఆదివారం, 31 జులై 2022 (13:24 IST)
దేశంలో కొత్తగా మరో 19 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు.. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 19,637 మందికి కోవిడ్-19 సోకిందని తెలిపింది.
 
దీంతో బాధితుల సంఖ్య 4,40,19,811కి చేరింది. గడిచిన 24 గంటల్లో 19,336 మంది కోలుకుని ఇంటికి చేరుకోగా.. ప్రస్తుతం 1,43,676 మంది చికిత్స పొందుతున్నారు. కోవిడ్ కారణంగా 45 మరణాలతో, మరణాల సంఖ్య 5,26,357కు పెరిగింది. ఈ మేరకు నివేదికలో పేర్కొంది.
 
ఇదిలావుంటే, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు మరోమారు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వెల్లడించింది. జూలై 21వ తేదీన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు కోవిడ్‌ సోకినట్లు నిర్ధారించారు. అతను ఇప్పటికే రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్‌ను కూడా వేయించుకున్నారు. 
 
అయినప్పటికీ ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాడు. ఈ నెల 27న జో బిడెన్‌కు పరీక్షలు నిర్వహించి ఇన్‌ఫెక్షన్‌ నుంచి కోలుకున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఈ సందర్భంలో, బిడెన్‌కు ఈ రోజు (జూలై 31) మళ్లీ కోవిడ్ సోకినట్లు నిర్ధారించబడింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments